రొయ్యల సీడ్ కోసం వెడుతూ..కాలువలో పడ్డ కారు...

Mar 4, 2020, 3:46 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలం జగన్నాధపురం వంతెన వద్ద ఈ తెల్లవారు జామున కారు కాలువలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. అగ్నిమాపక సిబ్బంది కారును కాలువలోనుండి కారును బైటికి తీశారు. కాజా, మత్స్యపురి గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు రొయ్యల సీడ్ కోసం వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.