విజయవాడ కరకట్టపై బస్సు బోల్తా: వేగం వల్లే... (వీడియో)

Aug 31, 2019, 8:14 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లాలో బస్సు బోల్తా పడింది. విజయవాడు నుంచి అవనిగడ్డ వెళ్తున్న బస్సు పెద్ద పులిపాక వద్ద కరకట్టపై బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 50 మంది దాకా ప్రయాణికులు ఉన్నారు. 

ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. గాయపడినవారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఎపి 20 జడ్ 3129 అనే నెంబర్ గల బస్సు ప్రమాదానికి గురైంది. మలుపు వద్ద డ్రైవర్ వేగంగా వెళ్లడం వల్లనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.