టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదం... వైసిపి ఎమ్మెల్యేకు బిజెపి నేత స్ట్రాంగ్ వార్నింగ్

Jul 1, 2021, 11:49 AM IST

విజయవాడ: ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం కొనసాగుతోంది. ఒక మతానికి చెందినవారి ఓట్ల కోసమే స్థానిక వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటుచేయిస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. అయితే ప్రొద్దుటూరు ప్రజలేమీ అమాయకులు కాదని... మీ అహంకారాన్ని త్వరలోనే అణగదొక్కుతారని హెచ్చరించారు. 
టిప్పు విగ్రహాన్ని ప్రజలే సామూహికంగా కలిసి కూల్చుతారని బిజెపీ నేత హెచ్చరించారు.