తల్లుల అకౌంట్ కే ఫీజు రీయింబర్స్‌మెంట్.. విద్యార్థులకు ఏపీ సీఎం గుడ్ న్యూస్..

Apr 14, 2020, 5:29 PM IST

కరోనా నేపథ్యంలో విద్యార్ధులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ,1,800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతేకాకుండా 2019-20 సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించామని జగన్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో  కాన్ఫరెన్స్‌లో జగన్ వెల్లడించారు.