80 లక్షల విలువైన అక్రమ మద్యం.. బుల్ డోజర్లతో తొక్కించిన పోలీసులు...

Jul 18, 2020, 1:30 PM IST

కృష్ణాజిల్లా మచిలీపట్నం పోలీస్ గ్రౌండ్లో 80 లక్షలు ఖరీదు చేసే 14,000 వేలు అక్రమ మద్యం బాటిళ్లను అధికారులు ధ్వంసం చేశారు. అక్రమ మద్యం రవాణా తయారీకి పాల్పడుతున్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. గతంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కి మాత్రమే అక్రమంగా వచ్చిన మద్యం ధ్వంసం చేసే అధికారం ఉండేది. అయితే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రతి జిల్లా ఎస్పీ లకు అధికారం ఇవ్వగా మొదటి సారి ఇలా అక్రమ మార్గాల ద్వారా వచ్చిన మద్యాన్ని ధ్వంసంచేసారు.