Praja Palana: ప్రజాపాలనకు భారీ స్పందన.. తొలిరోజు ఎన్ని అప్లికేషన్స్‌ వచ్చాయంటే..?

Published : Dec 29, 2023, 04:51 AM IST
Praja Palana: ప్రజాపాలనకు భారీ స్పందన..  తొలిరోజు ఎన్ని అప్లికేషన్స్‌ వచ్చాయంటే..?

సారాంశం

Praja Palana:  ఆరు గ్యారెంటీల అమలు కోసం రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన లభించింది. తొలి రోజు ఎన్ని దరఖాస్తులొచ్చాయంటే?      

Praja Palana: ఆరు హామీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి తొలిరోజు భారీ స్పందన లభించింది. గురువారం నాడు తెలంగాణ వ్యాప్తంగా 7.46 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,46,414 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,88,711 దరఖాస్తులు రాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)తోపాటు పట్టణ ప్రాంతాల్లో 4,57,703 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

ప్రజాపాలన నిర్వహణ తీరును సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి కౌంటర్ వద్ద ఆరు హామీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.  ఈ దరఖాస్తు ఫారమ్‌ల విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు. దరఖాస్తులు ఇచ్చేందుకు గ్రామసభలకు వచ్చే వారికి తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని ఆమె అన్నారు.

కౌంటర్ల వద్ద క్యూలు సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఫాలో-అప్ కోసం దరఖాస్తుదారులకు ప్రత్యేక నంబర్‌ను అందించనున్నట్లు ఆమె తెలిపారు. దరఖాస్తు ఫారాలు అందించేందుకు ప్రత్యేక డెస్క్‌లు ఏర్పాటు చేయాలి. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన ఉచితాలను పొందేందుకు తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో తెల్లవారుజాము నుంచే వేలాది మంది క్యూ కట్టారు. కొత్త ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం కింద జనవరి 6 వరకు 16,395 చోట్ల దరఖాస్తులను ప్రభుత్వ అధికారులు స్వీకరిస్తున్నారు.

కొత్త ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం కింద జనవరి 6 వరకు 16,395 చోట్ల దరఖాస్తులను ప్రభుత్వ అధికారులు స్వీకరిస్తున్నారు.  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మునిసిపల్ వార్డుల్లో సాధారణ సెలవు దినాలు అయిన డిసెంబర్ 31, జనవరి 1 మినహా మిగిలిన అన్ని రోజుల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.

కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం 3,714 మంది అధికారులను నియమించింది. వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు ప్రతిరోజూ రెండు గ్రామాలు లేదా రెండు వార్డులను సందర్శించనున్నారు. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమానికి 10 మంది ఐఏఎస్ అధికారులను సమన్వయకర్తలుగా ప్రభుత్వం నియమించింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత అమలు కోసం డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఐదు హామీల కోసం ఒకే దరఖాస్తు ఫారమ్ ఉంది. ఆరో హామీ (యువ వికాసం) కోసం విద్యా సంస్థల్లో తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తారు. మహాలక్ష్మి పథకం కింద.. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, వంట గ్యాస్ సిలిండర్‌ను రూ.500కి సరఫరా చేస్తారు.  రైతు భరోసా హామీ కింద ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం ఎకరాకు రూ.15,000 అందజేస్తారు. వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12,000 అందజేస్తారు. ఇందిరమ్మ ఇండ్లు కింద నిరాశ్రయులైన వారికి ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 చదరపు గజాల ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు.

గృహజ్యోతి కింద ప్రతి నెలా 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా అందించనున్నారు. యువ వికాసం ఆధ్వర్యంలో అన్ని మండలాల్లోని విద్యార్థులకు, తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు ఒక్కొక్కరికి రూ.5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. చేయూత కింద వృద్ధాప్య, వితంతువులు, ఒంటరి మహిళలు వంటి వివిధ కేటగిరీల కింద లబ్ధిదారులకు రూ.4,000 నెలవారీ పింఛను అందజేస్తారు. వికలాంగులకు ప్రతి నెల రూ.6,000 అందజేస్తారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?
Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!