హన్మకొండ జిల్లాలో దారుణం: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

By narsimha lodeFirst Published Apr 29, 2022, 11:37 AM IST
Highlights

హన్మకొండ జిల్లా కమలాపూర్ లో మైనర్ బాలికపై  ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

హన్మకొండ: Hanamakonda జిల్లా KamalapurలోMinor Girlపై  ఐదుగురు Gang Rapeకి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. Schoolలోనే ఈ ఘటన చోటు చేసుకొంది.  ఈ ఘటనకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ లో హై స్కూల్ లో 8వ తరగతి విద్యార్ధినిపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు.

10  రోజుల పాటు నిందితులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా  చెబుతున్నారు. అత్యాచారం చేసిన నిందితులు కూడా మైనర్లేనని పోలీసులు గుర్తించారు. బాలిక ఒక్కోసారి ఒక్కో రకంగా పోలీసులకు చెప్పారు. మహిళా సీఐ బాలికను విచారిస్తున్నారు.  బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు. నిందితులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. 

click me!