Dec 18, 2018, 6:13 PM IST
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా వరంగల్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 20న కేటీఆర్ వరంగల్ లో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు ఆ జిల్లా నేతలు.