హైద్రాబాద్ లో దారుణం: బాలికకు మద్యం తాగించి సామూహిక అత్యాచారం

By narsimha lodeFirst Published Feb 8, 2023, 10:52 AM IST
Highlights

హైద్రాబాద్  నగరంలోని  చాంద్రాయణగుట్టలో బాలికపై  నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 


హైదరాబాద్: నగరంలోని చాంద్రాయణగుట్టలో  ఓ  బాలికపై  సామూహిక అత్యాచారానికి  పాల్పడ్డారు దుండగలు. మెడికల్  దుకాణం వద్దకు  వెళ్లిన  బాలికను ఓ మహిళ ట్రాప్ చేసింది.  తక్కువ ధరకు  మందులను ఇప్పిస్తానని చెప్పి బాలికను  మహిళ తీసుకెళ్లింది. ఈ బాలికను  నలుగురు వ్యక్తులకు  ఆ మహిళ అప్పగించింది.   గంజాయి తాగిన నలుగురు యువకులు గదిలో  బంధించి   సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  అత్యాచారానికి పాల్పడే ముందు  బాలికకకు మద్యం తాగించారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు  బాలికను వదిలిపెట్టారు.  ఇంటికి వచ్చిన బాలిక  పేరేంట్స్ కు ఈ విషయం చెప్పింది.  బాధితురాలి  ఫిర్యాదు మేరకు  పోలీసులు  కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!