పైగా రిలీజింగ్ డేట్ అంటూ ఈ నెల 28ని ప్రకటించారు.ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే ఈ నెల 28 వరకూ ఆగాల్సిందే.
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సినిమాల్లోకి అడుగుపెడుతున్నారా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇదేదో ఎవరో కల్పించిన వార్త కదండోయ్.. స్వయంగా కోహ్లీనే చెప్పాడు. కాకపోతే అందులో కొంత మెలిక పెట్టాడు. దీంతో ఈ విషయం పై క్లారిటీ రాక.. అభిమానులు అయోమయానికి గురౌతున్నారు.
ఇంతకీ మ్యాటరేంటంటే..ఈ రోజు విరాట్ కోహ్లి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోకి క్యాప్షన్ గా ‘పదేళ్ల తర్వాత మరో అరంగేట్రం చేస్తున్నాను.. వెయిట్ చేయలేకపోతున్నాను ’అంటూ కామెంట్ చేశారు. పైగా రిలీజింగ్ డేట్ అంటూ ఈ నెల 28ని ప్రకటించారు.ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే ఈ నెల 28 వరకూ ఆగాల్సిందే. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే ఇదే రోజు ఆయన సతీమణి అనుష్క శర్మ నటించిన ‘సూయి ధాగా’ చిత్రం విడుదలవుతోంది. దాంతో ఇప్పుడు అందరిలో ఒకే అనుమానం.. కోహ్లి సినిమాల్లోకి వస్తున్నారా.. హీరోగానా లేకా తన భార్య అనుష్క చిత్రంలో ఏదైనా గెస్ట్ రోల్లో నటిస్తున్నారా.. అది కాక ఏదైనా షార్ట్ ఫిలింలో నటిస్తున్నారా అంటూ తెగ ఆలోచిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే ఈ నెల 28 వరకూ ఆగాల్సిందే.
Another debut after 10 years, can't wait! 😀 #TrailerTheMovie www.trailerthemovie.com
A post shared by Virat Kohli (@virat.kohli) on Sep 20, 2018 at 8:30pm PDT
కోహ్లి షేర్ చేసిన ఫోటోలో విరాట్ కోహ్లి ‘ట్రైలర్ ద మూవీ’ అని ఉంది. దీన్ని వాగ్న్ ప్రొడక్షన్ వారు రూపొందిస్తున్నట్లు ఉంది. ఈ ఫోటోలో కోహ్లి సూపర్ హీరో అవతారంలో ఉన్నారు. అంతేకాక ‘పది సంవత్సరాల తర్వాత మరో డెబ్యూ ఇంకా వెయిట్ చేయలేను’ అంటూ కామెంట్ చేశారు. దాంతో పాటు సెప్టెంబర్ 28న విడుదల అవ్వనున్నట్లు తెలిపాడు. మరో వారం ఆగితేగానీ.. దీనిపై క్లారిటీ రాదు.