పివీ సింధుపై సైనా విజయం: నాలుగోసారి టైటిల్ ఆమెదే

By telugu teamFirst Published Feb 17, 2019, 9:24 AM IST
Highlights

గౌహతిలో జరిగిన ఫైనల్‌లో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుపై సైనా 21-18, 21-15 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ యావత్తూ తనదైన శైలిలో ఆడుతూ ప్రత్యర్థి మట్టి కరిపించింది. కాగా, సింధు వరుసగా రెండో సారి టైటిల్ చేజార్చుకుంది. 

గౌహతి: జాతీయ సీనియర్ మహిళా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పీవీ సింధును సైనా నెహ్వాల్ ఓడించింది. దాంతో నాలుగోసారి టైటిల్ హైదరాబాదీ స్టార్ సైనా నెహ్వాల్ దక్కించుకుంది. 

గౌహతిలో జరిగిన ఫైనల్‌లో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుపై సైనా 21-18, 21-15 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ యావత్తూ తనదైన శైలిలో ఆడుతూ ప్రత్యర్థి మట్టి కరిపించింది. కాగా, సింధు వరుసగా రెండో సారి టైటిల్ చేజార్చుకుంది. 

నిరుడు జరిగిన ఫైనల్‌లోనూ సింధు ఓటమి పాలై రెండో స్థానానికే పరిమితమైంది. తొలి గేమ్‌లో సింధు నుంచి గట్టిపోటీ ఎదురైనా నెహ్వాల్‌ 21-18తో గేమ్‌ గెలిచింది. రెండో గేమ్‌లో ఇద్దరు కూడా నువ్వానేనా అన్నట్లు పోరాటం చేశారు.  ఒక సందర్భంలో 7-7తో హోరాహోరీగా సాగింది. అయితే ఆ తర్వాత వరుస పాయింట్లతో 11-9తో ఆధిక్యంలోకి వెళ్లిన సైనా ఆ తర్వాత సింధును వెనక్కి నెట్టేసింది. 

పురుషుల సింగిల్స్‌లో సౌరభ్‌వర్మ విజేతగా నిలిచాడు. ఫైనల్లో 21-18, 21-13తో లక్ష్యసేన్‌ను ఓడించిన అతను మూడోసారి జాతీయ ఛాంపియన్‌ అయ్యాడు. పురుషుల డబుల్స్‌లో ప్రణవ్‌ చోప్రా-చిరాగ్‌శెట్టి టైటిల్‌ గెలిచారు. ఫైనల్లో ఈ జోడీ 21-13, 22-20తో అర్జున్‌-శ్లోక్‌ రామచంద్రన్‌పై గెలిచింది. 
మహిళల డబుల్స్‌లో శిఖ-అశ్విని 21-16, 22-20తో మేఘన-పూర్వీషాలపై గెలిచి టైటిల్‌ గెలుచుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మను అత్రి-మనీషా 18-21, 21-17, 21-16తో రోహన్‌-కుహు గార్గ్‌ను ఓడించి విజయం సాధించారు.

click me!
Last Updated Feb 17, 2019, 9:24 AM IST
click me!