Apr 4, 2018, 11:27 AM IST
క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-11వ సీజన్ మరో మూడో రోజుల్లో మొదలు కానుంది. అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టేశాయి. కేవలం ఆటతోనే సరిపెట్టకుండా స్టెప్పులేసి మరీ అభిమానులను ఆకట్టుకోవడానికి రాయల్ చాలెంజర్స్(ఆర్సీబీ) బెంగుళూరు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఆర్సీబీ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఆటగాళ్లు యజువేంద్ర చాహల్, బ్రెండన్ మెకల్లమ్ చిందులేశారు. ‘ఐపీఎల్ కోసం లెజెండ్స్తో వార్మప్ మొదలెట్టేశా’ అంటూ కోహ్లి, మెక్కల్లమ్ను ట్యాగ్ చేస్తూ 12 సెకన్ల నిడివి ఉన్న డాన్స్ వీడియోను చాహల్ సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు.