రైతుల జీవితాలను మార్చేందుకు యోగి సర్కార్ సరికొత్త పథకం

By Arun Kumar PFirst Published Oct 8, 2024, 11:28 AM IST
Highlights

యోగి ప్రభుత్వం యూపీ అగ్రిజ్ ప్రాజెక్ట్ ద్వారా రైతుల ఆదాయం, వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఏం చేయనుందో తెలుసా? 

లక్నో: యోగి ప్రభుత్వం అన్నదాతల జీవితాలను మార్చే ప్రయత్నం చేేస్తోంది. అందుకోసమే యూపీ అగ్రిజ్ ప్రాజెక్ట్ ను రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రైతుల ఆదాయం, వ్యవసాయ ఉత్పత్తులు పెంచడంతో పాటు వ్యవసాయ సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి జెవర్ విమానాశ్రయం సమీపంలో ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీనిని ప్రపంచ బ్యాంకు సహాయం అందిస్తోంది.  

ఇక ప్రపంచ స్థాయిలో 2 నుండి 3 పంటలను పెద్ద ఎత్తున ఎగుమతి చేయడానికి వ్యవసాయ SEZ (స్పెషల్ ఎకనామిక్ జోన్) ఏర్పాటుకు కూడా యోగి సర్కార్ సిద్దమయ్యింది.  అదనంగా 2 నుండి 3 ప్రపంచ స్థాయి హ్యాచరీలు కూడా ఏర్పాటు చేయనున్నారు. యూపీ అగ్రిజ్ పథకం కింద వ్యవసాయ రంగంలో రైతులకు రుణ లభ్యతను పెంచడానికి సమగ్ర ఏర్పాట్లు చేయాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. యోగి ప్రభుత్వం యొక్క ఈ ప్రయత్నం రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని దేశంలోనే అగ్రగానిగా నిలపడానికి దోహదపడుతుంది.

Latest Videos

జెవర్ విమానాశ్రయం సమీపంలో ఎగుమతి కేంద్రం

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరించడానికి, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ గుర్తింపును అందించడానికి ఇటీవల ఉత్తరప్రదేశ్ అగ్రికల్చర్ గ్రోత్ అండ్ రూరల్ ఎంటర్‌ప్రైజెస్ ఎకోసిస్టమ్ స్ట్రెంగ్థెనింగ్ (యూపీ అగ్రిజ్) ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి జెవర్ విమానాశ్రయం సమీపంలో ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేయబడుతుంది. దీని ద్వారా హై వాల్యూ వ్యవసాయ ఉత్పత్తులైన వేరుశెనగ, కూరగాయలు, నల్ల ఉప్పు బియ్యం, నువ్వులు వంటివి విదేశాలకు ఎగుమతి చేయబడతాయి.

ఇప్పటికే మాంసం, బాస్మతి బియ్యం, పండ్లు, కూరగాయలు, ఆహార శుద్ధి రంగంలోని వివిధ రకాల ఉత్పత్తులను ఉత్తరప్రదేశ్ పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తోంది. ఇలాగే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను మరింత పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం 30,750 క్లస్టర్ రైతుల సమూహాలు అభివృద్ధి చేస్తున్నారు. అదే సమయంలో ఎగుమతిదారుల కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి సిద్దమయ్యారు.

వ్యవసాయ ఉత్పత్తుల కోసం స్పెషల్ ఎకనామిక్ జోన్లు (SEZ) :

యూపీ అగ్రిజ్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని 2 నుండి 3 వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేయడానికి వ్యవసాయ (స్పెషల్ ఎకనామిక్ జోన్) SEZలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఫార్వర్డ్ లింకేజ్, ఎగుమతి మార్కెట్లలో ఎక్కువ వాటాను కైవసం చేసుకోవడంపై దృష్టి సారిస్తాయి. వీటిని రాష్ట్రంలోని 11 జిల్లాల్లో అభివృద్ధి చేస్తారు. వీటిలో నల్ల ఉప్పు బియ్యానికి సిద్ధార్థనగర్, గోరఖ్‌పూర్‌లలో SEZలు ఏర్పాటు చేయబడతాయి. అదేవిధంగా వేరుశెనగ కోసం ఝాన్సీ, ఉలవల కోసం లలిత్‌పూర్, కూరగాయల కోసం జౌన్ పూర్, భదోహి, బనారస్, ఘాజీపూర్, బలియాలో సెజ్ లు ఏర్పాటు చేయబడతాయి.

ఈ ప్రాజెక్ట్ కింద రాబోయే ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలోని ప్రధాన పంటల దిగుబడిని 30 నుండి 50 శాతం వరకు పెంచడానికి సమగ్ర చర్యలు తీసుకుంటారు. దీని వల్ల రైతుల ఆదాయం కనీసం 25 శాతం పెరుగుతుంది. అంతేకాకుండా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచ స్థాయి కార్బన్ క్రెడిట్ మార్కెట్ ఏర్పాటు చేయబడుతుంది. రాష్ట్ర రైతులకు వాతావరణ సమాచారాన్ని అందించడానికి స్థానిక వాతావరణ కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. అదేవిధంగా చేపల పెంపకాన్ని ప్రోత్సహించడానికి 2 నుండి 3 ప్రపంచ స్థాయి హ్యాచరీలు ఏర్పాటు చేయబడతాయి.

click me!