తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇలా తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ వంటి ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.
11:43 PM (IST) May 22
Ayush Mhatre to lead India U19: ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును ప్రకటించారు. చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ ప్లేయర్ ఆయూష్ మాత్రే కెప్టెన్గా ఎంపికయ్యాడు.
10:53 PM (IST) May 22
T20 World Cup 2026: ఐపీఎల్ 2025 పలువురు యంగ్ ప్లేయర్లు అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నారు. టీ20 ప్రపంచ కప్ 2026 కి ముందు భారత జట్టులో చేరడానికి బలమైన పోటీని ఇస్తున్నారు. తాము జట్టులో ఉండటానికి అర్హులమని నిరూపించారు.
10:19 PM (IST) May 22
మనలో చాలా మంది కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేస్తుంటాం కదా.. ఎక్కువసేపు కూర్చొని ఉంటే ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా? ఒక్కోసారి క్యాన్సర్ కూడా రావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
10:12 PM (IST) May 22
Tirumala Tirupati Devasthanams: తిరుమలలో భక్తుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు టీటీడీ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది.
09:52 PM (IST) May 22
ఈ కాలం పిల్లలు చిన్న వయసులోనే కంటి చూపు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందరూ ఎలక్ట్రానిక్ వస్తువులే కారణం అని అనుకుంటారు. కాని దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో వివరంగా ఇప్పుడు చూద్దాం.
09:25 PM (IST) May 22
IPL 2025 GT vs LSG: ఐపీఎల్ 2025 జీటీ vs ఎల్ఎస్జీ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నోటీమ్ పరుగుల వరద పారించింది. మిచెల్ మార్ష్ సెంచరీతో దుమ్మురేపాడు.
08:59 PM (IST) May 22
Virat and Rohit: టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
08:45 PM (IST) May 22
కోపం సర్వసాధారణమైన ఎమోషన్. అయితే కోపం ఎక్కువైతే మనల్నే దహిస్తుందని చెబుతుంటారు. అలాంటి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి.? ఒక నీతి కథతో ఇప్పుడు తెలుసుకుందాం..
08:34 PM (IST) May 22
Team India: ఇండియా అండర్-19 జట్టు త్వరలోనే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 24 నుండి జూలై 23 వరకు ప్రాక్టీస్ మ్యాచ్ తో పాటు 5 వన్డేలు ఆడనుంది. యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే కెప్టెన్గా ఎంపిక చేయగా, వైభవ్ సూర్యవంశీ కూడా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
07:46 PM (IST) May 22
IPL 2025 GT vs LSG: ఐపీఎల్ 2025 జీటీ vs ఎల్ఎస్జీ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. క్యాన్సర్ అవగాహన కోసం శుభ్మన్ గిల్ జట్టు లావెండర్ జెర్సీలు ధరించింది.
07:31 PM (IST) May 22
ఒక్క రోజులో జీవితం మారుతుందా.? అంటే అంత సులభమైన విషయం కాదని చెప్పాల్సిన పనిలేదు. అయితే ఓ వ్యక్తి జీవితం మాత్రం ఒక్క రోజులోనే మారింది. ఇంతకీ ఎవరా వ్యక్తి.? ఆయన జీవితం ఎలా మారింది.? ఇప్పుడు తెలుసుకుందాం..
07:15 PM (IST) May 22
Hyderabad Regional Ring Road (RRR): హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) ఉత్తర భాగాన్ని 6 లైన్ల ఎక్స్ప్రెస్వేగా నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
07:08 PM (IST) May 22
టాలీవుడ్ స్టార్ హీరో, కోట్ల మంది అభిమానులున్న మాస్ హీరో, వరుసగా సినిమాలు చేస్తున్న ఈ హీరో రీసెంట్ గా ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 10 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఆ పాత్రను చేయడానికి 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారట.
06:44 PM (IST) May 22
టీవీఎస్ కంపెనీ కొత్త స్కూటర్ NTORQ 125 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. తక్కువ గంటల్లో వేల కి.మీ. ప్రయాణించి రికార్డ్ బద్దలుకొట్టింది. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
06:09 PM (IST) May 22
మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నంబాల కేశవరావు (బస్వరాజ్) ఇటీవల ఎన్కౌంటర్లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి తర్వాత ఆ స్థానం ఎవరు భర్తీ చేస్తారన్న అంశంపై ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి సారించాయి.
06:07 PM (IST) May 22
వాట్సాప్ లో మీ DP(డిస్ ప్లే పిక్చర్) మార్చాలనుకుంటున్నారా? మంచి లొకేషన్, మంచి డ్రెస్ వేసుకొని కొత్త ఫోటో దిగి అప్పుడు మారుద్దామని రోజులు గడిపేస్తున్నారా? ఇకపై అలా చేయకండి. వాట్సాప్లోనే కొత్త ఏఐ ఫీచర్ వచ్చింది. అదెలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.
05:49 PM (IST) May 22
NEET PG - Supreme court: నీట్ పీజీ పరీక్షలో పారదర్శకత కోసం సుప్రీంకోర్టు రా-స్కోర్లు, ఆన్సర్ కీలు, నార్మలైజేషన్ ఫార్ములా విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
05:28 PM (IST) May 22
ఆర్టిఫిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని మార్చేస్తోంది. రోజురోజుకీ వస్తున్న మార్పులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వీటిలో ప్రధానమైంది చాట్ జీపీటీ. ఈ ఏఐ టూల్లో ఉన్న ఒక బెస్ట్ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
05:18 PM (IST) May 22
Central Government Housing Policy: దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వ నివాసాల కేటాయింపులో 4% రిజర్వేషన్ కల్పిస్తూ గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
04:54 PM (IST) May 22
హైదరాబాద్ అనగానే ఇక్కడి ఎన్నో అద్భుత నిర్మాణాలు గుర్తొస్తాయి. చారిత్రక కట్టడాలతో పాటు ఆధునిక నిర్మాణాలు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా మెహిదీపట్నంలో మరో అద్భుత నిర్మాణం అందుబాటలోకి రానుంది.
04:25 PM (IST) May 22
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ అంశం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ చర్యను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
04:09 PM (IST) May 22
బ్యాంక్ ఆఫ్ బరోడా 500 ఆఫీస్ అసిస్టెంట్లను నియమకాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాల? ఎ అనే వివరాలను చూద్దాం.
03:20 PM (IST) May 22
అణ్వాయుధ దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇటీవల యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరుదేశాల సైనిక సామర్థ్యాల గురించి బాగా చర్చ జరిగింది. కాబట్టి ఏ దేశ సైనిక బలం ఎంతో తెలుసుకుందాం.
02:45 PM (IST) May 22
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈవీ వాహనాల తయారీలోకి అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలోనే పతంజలి కూడా ఎలక్ట్రిక్ సైకిల్ను లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
02:44 PM (IST) May 22
సాధారణంగా 7 సీటర్ కార్లు ఎక్కువ మైలేజ్ ఇవ్వవు. కాని కియా కంపెనీ విడుదల చేయనున్న కొత్త 7 సీటర్ కారు కారెన్స్ క్లావిస్ అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది. 7 సీటర్ కార్లకు పోటీగా మార్కెట్ లోకి రిలీజ్ అవుతోంది. ఈ కారు రిలీజ్ డేట్, మైలేజ్, ఫీచర్స్ తెలుసుకుందామా?
01:47 PM (IST) May 22
భారత ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఆడబిడ్డల నుదిట సిందూరాన్ని చేరిపేసిన వారిని మట్టిలో కలిపేసామని…ఇకపై కూడా భారత్ తీరు ఇలాగే ఉంటుందని ఆయన స్పష్టం చేసారు.
01:22 PM (IST) May 22
పురాతన భారతీయ నావికా వారసత్వం నుం ప్రేరణ పొందిన సంప్రదాయ నౌక.. ఐఎన్ఎస్వి కౌండిన్యను భారత నౌకాదళం ప్రారంభించింది.
01:08 PM (IST) May 22
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ గట్టిగానే ప్రతిస్పందించిందని… పాకిస్థాన్ లోనే కాదు ఉగ్రవాదులు ఎక్కడున్న వదిలిపెట్టబోమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటూ ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసారు.
12:47 PM (IST) May 22
ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణకు తానే కారణం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పారు. వాణిజ్య చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించి సంధి చేశానని ఆయన అన్నారు.
12:27 PM (IST) May 22
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.
12:19 PM (IST) May 22
తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను రూ.2,750 కోట్లతో అభివృద్ధి చేస్తున్న కేంద్రం.వాటిలో మూడిటిని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.
12:03 PM (IST) May 22
ఢిల్లీలో ఉగ్రదాడికి పాక్ ఐఎస్ఐ నిఘా సంస్థ పన్నిన కుట్రను భారత గూఢచారులు సీక్రెట్ ఆపరేషన్తో ఛేదించారు.
11:57 AM (IST) May 22
Kawasaki Versys X 300 India: కవాసాకి వెర్సిస్-X 300 భారత్లో విడుదలైంది. బిగినర్ అడ్వెంచర్ టూరింగ్ బైక్గా మార్కెట్ లోకి అడుగుపెట్టిన ఈ సూపర్ బైక్ ఫీచర్లు, ధరెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
11:55 AM (IST) May 22
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మరోసారి భీకర కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్కౌంటర్ లో మావోయిస్టులు మరణించినట్లు సమాచారం.
11:46 AM (IST) May 22
ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు ఎంత పొదుపు చేశామన్నదే ముఖ్యమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతుంటారు. చిన్న మొత్తంలో చేసే పొదుపు దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని అందిస్తాయి.
11:43 AM (IST) May 22
పాక్ కుట్రను బీఎస్ఎఫ్ భగ్నం చేసింది. 50 మంది ఉగ్రవాదులను భారత్లోకి పంపే ప్రయత్నం విఫలమైంది.
11:29 AM (IST) May 22
ప్రస్తుతం తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే ఊహించారా? అంటే ఆయన చర్యలు అవుననే చెబుతున్నాయి. ఎప్పుడో ఐదారు నెలలకిందే ఈ భారీ వర్షాలకు గుర్తించిన సీఎం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. అవేంటో చూద్దాం.
10:55 AM (IST) May 22
అమెరికా రూపొందిస్తున్న గోల్డెన్డోమ్ రక్షణ వ్యవస్థలో చేరేందుకు కెనడా చర్చలు జరుపుతోంది.
10:22 AM (IST) May 22
స్టార్ హీరో ధనుష్ త్వరలో ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్లో నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు వైరల్ గా మారాయి.
10:08 AM (IST) May 22
అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది. వాషింగ్టన్ డీసీ లోని ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులపై ఉగ్రవాదులు దాడి చేశారు.ఈ కాల్పుల్లో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు.