సింగపూర్ లో అవార్డ్ అందుకున్న అయ్యన్న ఇన్ ఫ్రా సిఎండీ శ్రీధర్ (వీడియో)

Jan 22, 2019, 3:46 PM IST

అత్యాధునిక సౌకర్యాలతో, లగ్జరీ గేటెడ్ అపార్ట్ మెంట్లను అందుబాటు ధరల్లో అందిస్తూ హైదరాబాద్ లో తనదైన ముద్ర వేసుకున్న సంస్థ అయ్యన్న ఇన్ ఫ్రా ప్రతిష్టాత్మక అవార్డును సాధించింది. ఏషియా వన్ బిజినెన్ మ్యాగజైన్, ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్ సంస్థలు (Price water house Coopers) సంయుక్తంగా అందించిన అవార్డుల్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ బ్రాండ్ గా అయ్యన్న ఇన్ ఫ్రా నిలిచింది.  సింగపూర్ లో జరిగిన ఆసియా గ్రేటెస్ట్ బ్రాండ్స్ & లీడర్స్ కార్యక్రమంలో అయ్యన్న ఇన్ ఫ్రా చైర్మన్ & MD పీ. శ్రీధర్ అవార్డును అందుకున్నారు. 2018 సంవత్సరానికి సంబంధించి అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న సంస్థల కేటగిరీలో అయ్యన్న ఇన్ ఫ్రాకు నామినేషన్ తో పాటు, తుది ఫలితాల్లో అవార్డ్ కూడా వచ్చింది.

హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ , కొండాపూర్ ల్లో అయ్యన్న సంస్థ రూపొందించిన లగ్జరీ అపార్ట్ మెంట్లు వినియోగదారుల సంతృప్తిని వందశాతం పొందాయి. వినూత్న సౌకర్యాలు, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉండే నిర్మాణ శైలితో అయ్యన్న ప్రాజెక్టులు అందరి ప్రశంసలు అందుకున్నాయి. హైటెక్ సిటీ పరిసరాల్లో నిర్మించిన అయ్యన్న పర్ల్, ప్రైడ్, ప్లాటినా, ప్రీమియా, ప్రెస్టీజ్ లగ్జరీ గేటెడ్ అపార్ట్ మెంట్లు, వాటిల్లో ఉన్న అత్యాధునిక సౌకర్యాలు ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాయి.

 
ఎక్కడ రాజీపడకుండా, లాభాపేక్ష కంటే  కష్టమర్ల  సంతృప్తే ధ్యేయంగా తమ సంస్థ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుందని, లగ్జరీ గృహ సముదాయాలను నిర్మించటంలో ఇప్పటికే తమ బ్రాండ్ కు మంచి గుర్తింపు వచ్చిందన్నారు అయ్యన్న ఇన్ ఫ్రా చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్  పీ. శ్రీధర్. 


నాణ్యత, అందుబాటు ధరలే లక్ష్యంగా తాము కొత్త వాణిజ్య ప్రాజెక్టులు కూడా చేపట్టామని, కొండాపూర్ లో ఆయన్న ఐ.టీ పార్క్, గచ్చిబౌలిలో అయ్యన్న టెక్ పార్క్ ను నిర్మిస్తున్నట్లు స్వయంగా సివిల్ ఇంజనీర్ కూడా అయిన  శ్రీధర్ తెలిపారు. వ్యాపారంలో అత్యంత విలువైన వినియోగదారుల సంతృప్తిని పూర్తి స్థాయిలో సాధించిన సంస్థగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్, బెస్ట్ బ్రాండ్ గా దేశం తరుపున అవార్డు సాధించటం ఆనందంగా ఉందన్నారు. 


తాజా అవార్డ్ తమ బాధ్యతను మరింత పెంచిందని, కొత్త ప్రాజెక్టులను కూడా కస్టమర్ల అభిరుచి మేరకు, గడువులోగా పూర్తిచేసి అందించేందుకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు.