టోక్యో ఒలింపిక్స్: పోరాడి ఓడిన లవ్‌లీనా.. భారత్‌కి మరో కాంస్యం...

First Published Aug 4, 2021, 11:22 AM IST

టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ లవ్‌లీనా బోర్గోహైన్ పోరాటం ముగిసింది. 69 కేజీల విభాగంలో టర్కీకి చెందిన బుసేనాజ్ సుర్మెనలీతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో లవ్‌లీనా 5-0 తేడాతో పోరాడి ఓడింది. 

Lovlina Borgohain

సెమీస్ చేరడంతో లవ్‌లీనా బోర్డోహైన్‌కి కాంస్య పతకం లభించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య మూడుకి చేరింది. 

అంతకుముందు టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి రెజ్లింగ్‌లో విజయాలు దక్కాయి. దీపక్ పూనియా 86 కేజీల విభాగంలో చైనీస్ రెజ్లర్‌పై 6-3 తేడాతో విజయం సాధించి, సెమీఫైనల్స్‌కి దూసుకెళ్లాడు.

57 కేజీల ఫ్రీ స్టైయిల్ విభాగంల జరిగిన తొలి మ్యాచ్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా, కొలంబియన్ రెజ్లర్ ఆస్కర్ టిగ్రేరోస్‌తో జరిగిన మ్యాచ్‌ల 13-2 తేడాతో సునాయాస విజయాన్ని అందుకున్నాడు. 

జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా, ఫైనల్స్‌కి అర్హత సాధించాడు. తన తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా, టేబుల్ టాపర్‌గా నేరుగా ఫైనల్స్‌కి అర్హత సాధించాడు. 

గ్రూప్ బీలో పోటీపడిన భారత జావెలిన్ త్రో ప్లేయర్ శివ్‌పాల్ సింగ్ మాత్రం నిరాశపరిచాడు. మొదటి ప్రయత్నంలో 76.40 మీటర్లు విసిరిన శివ్‌పాల్ సింగ్, ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ ఆ మార్కును దాటలేకపోయాడు. 

మహిళల 57 కేజీల విభాగంలో పోటీపడిన అన్షూ మాలిక్‌, తొలి రౌండ్‌లోనే ఓడింది. ఇర్యాన కురాచ్‌కినాతో జరిగిన మ్యాచ్‌లో 2-8 తేడాతో ఓడింది అన్షూ. అయితే ఆమెతో పోటీపడిన కురాచ్‌కినా సెమీస్‌కి చేరడంతో అన్షూ మాలిక్, రేపరేజ్ రౌండ్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

click me!