టీటీ ప్లేయర్ మానికా బత్రాకి షోకాజ్ నోటీసులు... ఒలింపిక్స్‌లో కోచ్‌ని అలా అన్నందుకు...

First Published Aug 4, 2021, 9:00 PM IST

భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మానికా బత్రాకి టీటీ ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో మూడో రౌండ్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి టీటీ ప్లేయర్‌గా నిలిచిన మానికా బత్రాకి నోటీసులు పంపడానికి, విశ్వక్రీడల సమయంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలే...

2006 కామన్వెల్త్ గేమ్స్‌లో టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన ‘అర్జున అవార్డు’ గ్రహీత సౌమ్యదీప్ రాయ్, జాతీయ టీటీ కోచ్‌గా ఉన్నారు. ఒలింపిక్స్‌లో కూడా ఆయనే టీటీ కోచ్‌గా వ్యవహరించారు.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత టీటీ ప్లేయర్ మానికా బత్రా... మూడో రౌండ్‌లో ఓడిన విషయం తెలిసిందే. టీటీలో పోటీపడిన మిగిలిన ప్లేయర్లు టైమ్ అవుట్‌లో కోచ్‌ల విలువైన సలహాలు, సూచనలు తీసుకుంటుంటే... మానికా బత్రా మాత్రం ఒంటరిగా పోరాడింది. బ్రేక్ సమయంలోనూ ఆమె ఒంటరిగా కనిపించింది.

టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో శరత్ కమల్‌తో కలిసి బరిలో దిగింది మానికా బత్రా. అయితే భారీ అంచనాలున్న ఈ జోడీ, తొలి రౌండ్‌లోనే ఓడి నిరాశగా వెనుదిరిగింది...

మానికా బత్రా, తన మిక్స్‌డ్ డబుల్ ఆటగాడైన శరత్ కమల్ శిక్షణలోనే రాటుతేలింది. శరత్ కమల్ కోచింగ్‌లోనే ఈ జోడి ఆసియా క్రీడల్లో అదరగొట్టాడు. మిక్స్‌డ్ డబుల్స్‌తో పాటు మహిళల సింగిల్స్‌లోనూ పతకాలు సాధించారు. 

అయితే నేషనల్ గేమ్స్‌లో మానికా బత్రాను ఓడించిన సుత్రీతా ముఖర్జీ, సౌమ్యదీప్ శిక్షణలో ఆడుతోంది. సౌమ్యదీప్ రాయ్, ప్రస్తుతం జాతీయ టేబుల్ టెన్నిస్ కోచ్‌గా ఉన్నారు... 

అయితే ఒలింపిక్స్‌లో కోచ్ సలహాలు తీసుకోవడానికి ఇష్టపడని మానికా బత్రా... నేషనల్ కోచ్ సౌమ్యదీప్‌ను సుత్రీతా కోచ్‌గా పేర్కొంది. ఈ కామెంట్లపై టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీరియస్‌ అయ్యింది... 

‘మానికా బత్రా కోచ్ సలహాలు తీసుకోకూడదనుకోవడంలో తప్పులేదు. అయితే సౌమ్యదీప్‌ను పర్సనల్ కోచ్‌గా పేర్కొనడం మాత్రం చాలా తప్పు. సుత్రీత, సౌమ్యదీప్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. కానీ అతను నేషనల్ కోచ్... 

మానికా బత్రా పర్సనల్ కోచ్‌ కోసం అప్లై చేసింది. మేం కూడా రికమెండ్ చేశాం. అయితే టోక్యోలో ఉన్న నిబంధనల కారణంగా ఒకే కోచ్‌ను అనుమతించారు... కోచ్ కోసం చేసుకున్న అప్పీలు, ఆఖరి నిమిషంలో రద్దు కావడంతో మానికా బత్రా ఫీల్ అయ్యింది.

ఎగ్జిక్యూటీవ్ బోర్డు త్వరలో వీడియో సమావేశంలో పాల్గొని, మానికా బత్రాపై క్రమశిక్షణారాహిత్య చర్యలు తీసుకుంటాం...’ అంటూ తెలిపాడు భారత టీటీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్ బెనర్జీ.. 

టోక్యో ఒలింపిక్స్ కోసం సౌమ్యదీప్ రాయ్, ఢిల్లీలో మూడు నెలల పాటు టీటీ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేశాడు. అయితే ఈ క్యాంపుకి రావడానికి ఇష్టపడని మానికా, మరో మూడు రోజుల్లో క్యాంపు ముగుస్తుందనగా చేరినట్టు సమాచారం. 

click me!