విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ గుడి. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేశాడు. కరుణించిన అమ్మవారిని తన హృదయస్థానంలో కొలువుండమని కీలుడు కోరాడట. రాక్షస సంహారం అనంతరం కీలుడు పర్వతంగా మారడంతో అమ్మవారు కీల పర్వతంపై కొలువు తీరిందట. అందుకే కీలాద్రిగా పేరు వచ్చింది. ఇంద్రుడు ఇక్కడకు వచ్చి పూజలు చేయడంతో ఇంద్ర కీలాద్రిగా పేరుపొందింది. భక్తుల కొంగుబంగారంగా మారిన విజయవాడ క్షేత్రంలో అమ్మవారి ప్రసాదం భక్తులకు ముఖ్యంగా పులిహోర, లడ్డూ పంచుతారు.
పులిహోరను బియ్యం, శనగపప్పు, చింతపండు, నూనె, బెల్లం, కరివేపాకు, ఎండుమిర్చితో తయారు చేస్తారు.
లడ్డూను శనగ పిండి, పంచదార, జీడిపప్పు, కిస్మిస్, ఎండుద్రాక్ష, యాలకులు, జాజికాయ, పచ్చ కర్పూరం, నెయ్యి ఉపయోగించి తయారు చేసి భక్తులకు పంచుతారు.