విఘ్నాలు తొలగించే భగవంతుడు
పురాణాల ప్రకారం.. రాక్షసుల వల్ల కలిగే బాధలను, కష్టాలను తొలగించేందుకు వినాయకుడిని పుట్టించమని దేవతలందరూ శివ పార్వతులను వేడుకుంటారు. దేవతల కోరికమేరకు పార్వతీ పరమేశ్వరులు విఘ్నేషుడిని పుట్టిస్తారు. విఘ్నాలు అంటే బాధలు.. హర్తా అంటే తొలగించేవాడని అర్థం. అందుకే విఘ్నాలను తొలగించే వినాయకుడినే మొదటిగా పూజించాలని పురాణాలు తెలియజేస్తున్నాయి. వినాయకుడికి ఒక్క దేవతలే కాదు.. మనుషులు కూడా మొదటి పూజలు నిర్వహిస్తారు.