గణేష్ చతుర్థి 2022: గణేష్ నిమజ్జనం వెనకున్న అసలు కథ ఇదే..!

First Published Aug 26, 2022, 10:54 AM IST

గణేష్ చతుర్థి 2022:  వినాయక చవితి మొదటి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు.. బొజ్జ గణపయ్య ఎన్నో పూజలందుకుంటాడు. అయితే ఆ తర్వాతి రోజు సంప్రాదాయం ప్రకారం.. చెరువులో లేదా నదిలో వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. ఇంతకీ గణేషుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా..?  

ganesh chaturthi 2022

వినాయక చవితి అని పిలువబడే గణేష్ చుతుర్థి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి. వినాయక చవితి.. వినాయకుడి జననాన్ని సూచిస్తుంది. గ్రెగ్రోరియన్ క్యాలెండర్ ప్రకారం... ఈ పండుగ ప్రతి ఏడాది ఆగస్టు లేదా సెస్టెంబర్ నెలలో వస్తుంది. ఈ పది రోజుల పండుగలో ప్రతి ఒక్కరూ ఏనుగు తల ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పూజిస్తారు. 

ఎలాంటి శుభాకార్యాలకైనా.. వినాయకుడినే మొదటగా పూజించడం ఆనవాయితీగా వస్తోంది. మనుషులే కాదు దేవలతలు సైతం వినాయకుడినే మొదటగా పూజిస్తారట. ఈయన పేరులోనే ఉంది కదా.. విఘ్నాలను (అడ్డంకులను) తొలగించేవాడని. 

ఇక దేశ వ్యాప్తంగా వినాయక చతుర్థి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ వినాయక చవితిని మొదటగా ఎప్పుడు జరుపుకున్నారో తేదీని చెప్పడం కష్టం. కానీ చరిత్ర పరంగా చూస్తే.. శాతవాహన, రాష్ట్రకూట, చాలుళ్య వంశాల పాలన నుంచి వినాయక చతుర్థిని జరుపుకున్నట్టు ఆనవాళ్లున్నాయని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. 

చారిత్రక రికార్డుల ప్రకారం.. గొప్ప మరాఠా నాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజా జాతీయతా స్ఫూర్తిని ప్రజల్లో  పెంపొందించడానికి గణేష్ చతుర్థి ఉత్సవాలను మహారాష్ట్రలో ప్రారంభించారు. 
 

వినాయకుడి నిమజ్జనం

సంప్రదాయ పండుగ అయిన వినాయక చవితి పండుగ చివరి రోజును నిమజ్జనం రోజు లేదా అనంత్ చతుర్థి లేదా విసర్జన్ అంటారు. ఈ రోజున వినాయకుడి విగ్రహాన్ని చెరువుల్లో లేదా నదుల్లో నిమజ్జనం చేస్తారు. ఇక ఈ నిమజ్జనం రోజునా వినాయకుడి విగ్రహాన్ని వాడవాడనా ఊరేగింపుగా తీసుకెళ్తారు. ప్రజలకు రకరకాల  ప్రసాదాలను పంచిపెడతారు. 

పురాణాల ప్రకారం.. గణేషుడి నిమజ్జనం వెనుక ఒక ఆసక్తికరమైన కథే ఉంది. ఈ పండుగ చివరి రోజు అంటే నిమజ్జనం రోజున బొజ్జ గణపయ్య  కైలాసంలో ఉండే తన తల్లిదండ్రులైన శివ పార్వతుల దగ్గరకు తిరిగి వెళ్తాడట. అంటే నిమజ్జనం తర్వాత. అయితే వినాయక చతుర్థిని జరుపుకోవడం అనేది మనిషి జనన, మరణ చక్రాల ప్రాముఖ్యతను సూచిస్తుంది. వినాయకుడి నిమజ్జనం కోసం విగ్రహాన్ని బయటకు తీసినప్పుడు ఇంట్లో ఉండే ఎన్నో అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు మీకున్న కష్ట, నష్టాలు కూడా పోతాయని ప్రజలు నమ్ముతారు. 

ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 31 తారీఖున వచ్చింది. ఈ రోజున ప్రజలందరూ సూర్యోదయానికి ముందే స్నానం చేసి.. వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూలతో పూజించాలి. బొజ్జ గణపయ్యను నిష్టగా పూజిస్తే.. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని ప్రజల నమ్మకం.  
 

click me!