వద్దనుకున్నా గర్భం...వలస కార్మికులకు కండోమ్ ల పంపిణీ

First Published Jun 3, 2020, 3:48 PM IST

ఈక్రమంలో అవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు రాష్ట్ర కుటుంబ ఆరోగ్య శాఖ కండోమ్‌ల పంపిణీ నిర్ణయం తీసుకుంది. 
 

ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కొన్ని సడలింపులు చేశారు. కాగా.. ఈ లాక్ డౌన్ సమయంలో అవాంఛిత గర్భాలు ఎక్కువగా నమోదౌనట్లు ఓ సర్వేలో తేలింది. చాలా మంది గర్భం వద్దు అనుకున్నా కూడా... వచ్చేశాయట.
undefined
కాగా...ఈ అవాంఛిత గర్భాలకు చెక్ పెట్టేందుకు బిహార్ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఉచితంగా కండోమ్‌లను, గర్భ నిరోధక మాత్రలను పంపిణీ చేస్తోంది.
undefined
బిహార్‌కు చెందిన 30 లక్షల మంది వలస కార్మికులు వివిధ దశల్లో రాష్ట్రానికి చేరుకున్నారు. వారిలో కొందరు ఇప్పటికే 14 రోజుల క్వారంటైన్‌ ముగిసి ఇళ్లకు చేరగా.. మరికొంతమంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
undefined
ఈక్రమంలో అవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు రాష్ట్ర కుటుంబ ఆరోగ్య శాఖ కండోమ్‌ల పంపిణీ నిర్ణయం తీసుకుంది.
undefined
క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నవారికి, ఇళ్లకు చేరుకున్న వలస కూలీలకు కండోమ్‌లు పంపిణీ చేస్తున్నామని బిహార్‌ ఆరోగ్యశాఖకు చెందిన డాక్టర్‌ ఉత్పల్‌ దాస్‌ వెల్లడించారు.
undefined
కేర్‌ ఇండియా సంస్థ సహకారంతో ఈ డ్రైవ్‌ చేపట్టామని వారు తెలిపారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 8.77 లక్షల మంది క్వారంటైన్‌ ముగించుకుని ఇళ్లకు వెళ్లారని, మరో 13 లక్షల మంది క్వారైంటైన్‌ సెంటర్లలో ఉన్నారని చెప్పారు.
undefined
బ్లాక్‌లు, జిల్లా కేంద్రాల్లో ఇంకా 5.30 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. అవాంఛిత గర్భధారణ విషయంలో ఇంటికి వెళ్లే ముందు వలస కూలీలకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
undefined
ఇది పూర్తిగా కుటుంబ నియంత్రణ కోసం చేపట్టిన కార్యక్రమం అని కోవిడ్‌-19తో ఎటువంటి సంబంధం లేదని ఉత్పల్‌ దాస్‌ స్పష్టం చేశారు. ఆరోగ్యశాఖ అధికారిగా జనాభాను అదుపులో ఉంచడం తమ బాధ్యత అన్నారు.
undefined
కాగా, బిహార్‌లో ఈ నెల 15తో క్వారంటైన్‌ సెంటర్ల సేవలు ముగియనున్నాయి. బిహార్‌ జనాభా 11.5 కోట్లు కావడం గమనార్హం.
undefined
click me!