ముఖ్యంగా, బెయిలీ వంతెనను నిర్మించడంలో ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ నుంచి 250 మంది సైనికులు పనిచేశారు. ఈ బృందానికి మేజర్ షెల్కే నాయకత్వం వహించారు. దాదాపు మూడు రోజులు కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో అసాధారణమైన నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. పగలు, రాత్రి నిరంతరాయంగా శ్రమించిన తర్వాత... సైన్యం 190 అడుగుల పొడవైన ఉక్కు వంతెనను విజయవంతంగా నిర్మించింది. భారీ వర్షాలు, వరదలను తట్టుకునేలా దీన్ని రూపొందించారు. రెస్క్యూ ఆపరేషన్కు అవసరమైన వాహనాలు కొత్తగా నిర్మించిన ఈ బెయిలీ వంతెనను దాటడం ప్రారంభించడంతో స్థానికుల్లో కాస్త ధైర్యం వచ్చింది. ఇది సహాయ చర్యలు, తదుపరి శోధన కార్యకలాపాల్లో కీలకమైన అడుగులు వేయడానికి తోడ్పడింది.