- లఖింపూర్ ఖేరి బాధితులకు న్యాయం: యూపీలోని లఖింపూర్ ఖేరిలో 2021 అక్టోబర్ 3న రైతులపై నుంచి కారు ఎక్కించిన ఘటనలో నలుగురు అన్నదాతలు మరణించారు. ఈ కేసులో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ప్రధాన నిందితుడిగా కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిశ్ మిశ్రా ఉన్నాడు.
- పింఛన్, రైతుల స్మారకం: ప్రతి రైతుకు నెలకు రూ. 10 వేల పింఛన్ ఇవ్వాలి. అలాగే.. 2020-21 రైతు ఆందోళనలో మరణించిన రైతుల స్మారకం నిర్మించడానికి ఢిల్లీలో స్థలం కేటాయించాలి.