ఆలయ ప్రాంగణంలోనే శివాలయం కూడా నిర్మిస్తున్నట్లు చంపత్ రాయ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలోని బగవా గ్రామం అద్భుతమైన శివలింగాలను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిందని... ఇక్కడ తయారయ్యే శివలింగాలకు దేశ, విదేశాల్లో గిరాకీ ఉందన్నారు. ఇక్కడే రామమందిర ప్రాంగణంలో ప్రతిష్టించే శివలింగం కూడా రూపుదిద్దుకుంటోందని చంపత్ రాయ్ వెల్లడించారు.
అయోధ్యలో చేపడుతున్న ఆలయాల ద్వారా ప్రభుత్వానికి రూ.400 కోట్ల వరకు GST వసూలయ్యే అవకాశం వస్తాయని అంచనా వేసారు. పనులు పూర్తయిన తర్వాత ఖచ్చితమైన పన్ను మొత్తం తెలుస్తుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.