ఇది యాదృచ్ఛికం కాదు కానీ రైల్వే డిపార్ట్ మెంట్ చక్కగా ప్రణాళిక ప్రకారం ఈ పని చేస్తోంది. దాని వెనుక ఉన్న కారణం ఏమిటంటే..
ఇండియన్ రైల్వేస్ రోజువారీగా పెద్ద సంఖ్యలో రైళ్లను నడుపుతుంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో బెడ్ షీట్లు, దిండు కవర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ దిండు కవర్లు, దుప్పట్లు ఏసీ కోచ్లలో ప్రయాణీకులకు అందిస్తారు.
ఉపయోగించిన దుప్పట్లను శుభ్రపరిచేందుకు తిరిగి సేకరిస్తారు. ఈ దుప్పట్లను శుభ్రం చేయడానికి ప్రత్యేక యంత్రాలను ఉపయోగిస్తారు. అంటే ఈ బెడ్ షీట్లు, దిండు కవర్లను 121 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిని ఉత్పత్తి చేసే పెద్ద బాయిలర్లతో కూడిన ప్రత్యేక యంత్రాల ద్వారా శుభ్రం చేస్తారు. బెడ్ షీట్లు 30 నిమిషాలు ఈ ఆవిరిలో ఉంటాయి. అవి పూర్తిగా క్రిమిరహితమయ్యాయని నిర్ధారణ అయ్యాక వాటిని మడతపెట్టి మళ్లీ ప్రయాణికులకు ఇస్తారు.