ఇక అసలు విషయానికొస్తే.. ఎలాంటి పెళ్లి ముహూర్తాలే లేని ఆషాడ మాసంలో.. వీరి పెళ్లిని ఎలా జరిపించారు అనే డౌట్ చాలా మందికి వచ్చింది. అయితే మనది చాంద్రమాన పంచాంగం. ఈ మాసాన్ని తెలుగు వారు ఎక్కువగా అనుసరిస్తారు. కానీ ఉత్తరాధి వారు మాత్రం సూర్యమాన పంచాంగాన్నే ఎక్కువగా అనుసరిస్తారు. సూర్యుని కదలికల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. దీనిలో అధిక మాసం ఉండదు. అందుకే ముహూర్తాలు, తిథులు, ఆచరణలో తేడాలు ఉంటాయి. ద్రుక్ గణితం ఆధారంగా పండితులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహా ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది.