1. డిజైన్.. జాతీయ జెండాలో మూడు రంగులుంటాయి. పైన ఉన్న కాషాయం(కేశరీ) రంగు ధైర్యానికి, త్యాగానికి గుర్తు. మధ్యలోని తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. చివరి రంగైన ఆకుపచ్చ రంగు కొత్తదనం, అభివృద్ధి, శ్రేయస్సుకు ప్రతీక. ఈ జెండాను 1921లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిడుగురాళ్లకు చెందిన పింగళి వెంకయ్య రూపొందించారు. ఆయన తెలుగువాడు కావడం మనకు గర్వకారణం.