ఇండియాలో చిట్టి చివరి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా..? దాని ప్రత్యేకతలివే..?

First Published Aug 18, 2024, 11:45 AM IST

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశాల్లో ఇండియా కూడా ఒకటి. రోజులో కోట్ల జనాబ రైల్వే ప్రయాణం చేస్తుంటారు.. సుధీర్ఘ రైల్వే లైన్ తో పాటు.. చరిత్ర కలిగిన ఇండియా రైల్వేలో.. చిట్టచివరి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా..? 
 

రోజుకు 2 కోట్ల మందికి పైగా ప్రయాణికులు, దగ్గర దగ్గరగా 70 వేల కిలోమీటర్ల నెట్ వర్క్.. 13 వేలకు పైచిలుకు రైళ్ళు.. వేలాదిగా రైల్వే స్టేషన్లు.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. ఇండియన్ రైల్వే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండియన్ రైల్వే మొదలైన దగ్గర నుంచి.. ఇప్పటి వరకూ జరిగిన డెవలప్ మెంట్..అద్భుతాలు.. అతిపెద్ద ప్రమాదాలు.. ఇవన్నీ అతిపెద్ద చరిత్ర అవుతుంది. భావితరాలకు ఇండియన్ రైల్వే..  ఓ పాఠం అవుతుంది. 

వేల స్టేషన్లు కలిగి ఉన్న భారతీయ రైల్వేకు ఎంతో చరిత్రం ఉంది..ఒక్కోక్క  రైల్వే స్టేషన్ కు ఒక్కో కథ ఉంది..  వాటి వెనుకాల ఎంతో మంది త్యాగం ఉంది. ఇలా చెప్పుకుంటే చాలా అవుతుంది కాని.. ఇప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే.. ఇండియాలో చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఏది.. ఎవరికైనా తెలుసా..?  భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్ గురించి మీకు తెలుసా? ఇది ఎక్కడ ఉంది..? దాని ప్రత్యేకత ఏంటి..? 

Latest Videos


ఇండియాలోనే చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఎక్కడో లేదు బంగ్లాదేశ్ సరిహద్దుకు  ఆనుకుని.. వెస్ట్ బెంగాల్ లో ఉంది భారతదేశపు చివరి రైల్వే స్టేషన్. ఆ స్టేషన్  పేరు సింగాబాద్ రైల్వే స్టేషన్. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని హబీబ్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ ను భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్‌గా పరిగణిస్తుంటారు. ఎందుకంటే దీని తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దు ప్రారంభమవుతుంది. 

ఈ సింగాబాద్ రైల్వే స్టేషన్ చాలా చిన్నది.. పురాతనమైనది కూడా.. బ్రిటీష్ కాలంలో దీన్ని నిర్మించారు. ఎంత చిన్నదైనా.. చాలా ప్రాచీనమైనది కావడంతో..  ఈ రైల్వే స్టేషన్ చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య గత సంబంధాలలో ఇది కీలక పాత్ర పోషించింది. స్వాతంత్య్రానికి ముందు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి వ్యక్తులు ఢాకా వెళ్ళడానికి ఈ స్టేషన్ గుండా వెళ్ళేవారు. 

అంత చరిత్ర ఉన్న ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోయింది. కనీసం ప్రభుత్వాలు.. ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చి.. హెరిటేజ్ ప్రాపర్టీగా కూడా దీన్ని కాపాడటంలేదు. ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడు రైల్వే స్టేషన్‌ నిర్మానుష్యంగా మారింది. ఇప్పుడు ఇక్కడ ప్రయాణీకుల కోసం ఏ రైలు ఆగదు. ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు గూడ్స్ రైళ్లకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ నుంచి బంగ్లాదేశ్‌కు కొన్ని గూడ్స్ రైళ్లు నడుస్తాయి.  ఈ రైల్వే స్టేషన్ కేవలం వ్యాపారానికి మాత్రమే ఉపయోగపడుతోంది. 

ఇక్కడ ఏ రైలు ఆగదు లేదా ప్రయాణీకులు ఎవరూ రారు. అందువల్ల ఈ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లు నిర్జనంగా కనిపిస్తుంటాయి. టిక్కెట్ కౌంటర్లు కూడా మూసివేశారు. స్టేషన్‌లో కొంతమంది రైల్వే సిబ్బంది మాత్రమే ఉన్నారు. 

click me!