సెలబ్రిటీలు కూడా దీక్షలు వేస్తూ ఉంటారు. ఎక్కువగా మన స్టార్స్ అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుంటారు. తెలుగు, తమిళ్, మలయాళం, బాలీవుడ్ స్టార్లు చాలా మంది అయ్యప్ప మాల ప్రతి సంవత్సరం వేసుకుంటారు. చిరంజీవి, రామ్ చరణ్, శర్వానంద్, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, ధనుష్, శింబు, వివేక్ ఒబెరాయ్, అజయ్ దేవగణ్…వీరంతా ప్రతీ ఏడాది అయ్యప్ప మాల ధరిస్తుంటారు. కొందరు శివమాల వేసుకుంటారు. ఇంకొందరు ఆంజనేయస్వామి దీక్ష చేపడతారు. ఇలా ఎవరికి వారు తమకు ఇష్టమైన దైవాన్ని స్మరిస్తూ.. కొన్నిరోజుల పాటు దీక్ష చేస్తుంటారు.