సాయి పల్లవి వ్యాఖ్యలపై సినీ నటి, బిజెపి నాయకురాలు విజయశాంతి తాజాగా స్పందించారు. అవగాహన లేకుండా మాట్లాడిన సాయి పల్లవికి రాములమ్మ చురకలంటించారు. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం.. ధర్మం కోసం దైవసమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది.డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం.... తప్పు చేసిన పిల్లవాడిని తల్లి దండించడం ఏవిధంగా ఒకటవుతాయి? ఆ దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా? అంటూ విజయశాంతి సాయి పల్లవిని ప్రశ్నించింది.