ఈ పండుగను పురస్కరించుకొని తిరుపతిలోని మోహనబాబు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాను. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన జన్మభూమి మోదుగులపాళెం. ఒక నటుడుగా, ఒక నిర్మాతగా, రాజ్యసభ సభ్యునిగా, విద్యాప్రదాతగా ఎదగడానికి నా తల్లిదండ్రులు, నా గ్రామప్రజలు మూలకారణం. పల్లెటూరు నుండి డిల్లీ పార్లమెంటు వరకు నాప్రస్తానం సాగడానికి నాకు జన్మనిచ్చిన నా పల్లెటూరే కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ సొంతం గ్రామం మోదుగులపాళెం నుండి 100 మంది గ్రామస్తులను కూడా ఆహ్వానించారు. అలాగే తన తల్లిదండ్రులు మంచు నారాయణస్వామి నాయుడు, లక్ష్మమ్మ లనూ గుర్తు చేసుకున్నారు.