ఇప్పటికే బాలకృష్ణ కోటీ రూపాయలు విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఏపీకి చెరో యాభై లక్షలు అందిస్తున్నట్టు వెల్లడించారు. ఎన్టీఆర్ సైతం కోటీ రూపాయలు విరాళాన్ని అందిస్తున్నట్టు వెల్లడించారు. తారక్ కి లోకేష్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ధన్యవాదాలు తెలిపాయి.
వీరితోపాటు త్రివిక్రమ్, హారికా అండ్ హాసిని నిర్మాత ఎస్ రాధాకృష్ణ, నాగవంశీలు కలిసి యాభై లక్షలు(చెరో 25లక్షలు) విరాళం ప్రకటించారు. `కల్కి 2898 ఏడీ` నిర్మాత ఏపీకి రూ.25లక్షలు విరాళం అందించారు.
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రూ.30లక్షలు(చెరో రూ15లక్షలు), విశ్వక్ సేన్ చెరో ఐదు లక్షలు, వెంకీ అట్లూరి చెరో ఐదు లక్షలు, హీరోయిన్ అనన్య నాగళ్ల చెరో రెండున్నర లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళం ప్రకటించారు.