కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించినప్పటి నుంచి చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దర్శకులు, నిర్మాతలు, నటులు వరుసగా చిరు నివాసానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే దిల్ రాజు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్, మారుతి, బుచ్చిబాబు ఇలా చాలా మంది సినీ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.