సముద్రపు తీర ప్రాంతంలోని ఓ గ్రామంలో జరిగేకథ ఇది అని తెలుస్తుంది. భయం అంటే తెలియని వాళ్లకి భయాన్ని పరిచయం చేసేలా హీరో పాత్ర ఉంటుందని దర్శకుడు కొరటాల శివ వెల్లడించారు. ఆయన గత చిత్రం `ఆచార్య` డిజప్పాయింట్ చేయడంతో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
క్వాలిటీ విషయంలో తగ్గకుండ రూపొందించారని సమాచారం. ఇందులో తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా కనిపిస్తారట. తండ్రి నిర్మించిన పోర్ట్ ని విలన్లు ఆక్రమించుకుంటే, కొడుకు వాళ్లని ఎదుర్కొని ఎలా తన సొంతం చేసుకున్నాడనేది కథగా `దేవర` ఉందబోతుందని సమాచారం. కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదల కాబోతుంది.