వాస్తవానికి RBI రూల్స్ ప్రకారం మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకు జరిమానా వేయొచ్చు. కాని ఆ జరిమానా వల్ల మీ ఖాతా బ్యాలెన్స్ మైనస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులదే. దీనర్థం మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే కస్టమర్ జరిమానా కట్టక్కర్లేదని కాదు. జరిమానా వేస్తే మినిమమ్ బ్యాలెన్స్ మైనస్ అవుతుంది. ఇలాంటి ఖాతాలున్న బ్యాంకులపై ఆర్బీఐ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ బ్యాంకులపైనే ఉంటుంది.
ఎవరైతే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయరో వారిని ఆ బ్యాంకులు హెచ్చరించాలి. బ్యాలెన్స్ మెయింటైన్ చేసేలా ప్రోత్సహించాలి.