కోవిడ్ -19 అఫెక్ట్ : బడ్జెట్ 2021పై పెరిగిపోతున్న అంచనాలు.. ఈ సారి ఆరోగ్య సంరక్షణకే అధిక ప్రాధాన్యత..?

First Published Jan 27, 2021, 12:10 PM IST

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆరోగ్య రంగం ప్రజల జీవితాల్లో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇటువంటి పరిస్థితిలో దేశ ఆరోగ్య సంరక్షణ నిర్మాణాన్ని మెరుగుపరచడానికి అధిక బడ్జెట్ కేటాయింపు అవసరమని ప్రాంతీయ సంస్థలు చెబుతున్నాయి. 'ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్'లో  ఫార్మా రంగంలో ప్రధాన పాత్ర పోషించింది. రాబోయే బడ్జెట్‌లో ముఖ్యంగా పరిశోధన, అభివృద్ధి ఇంకా ఆవిష్కరణల కోసం  ఫార్మా రంగానికి మద్దతు లభిస్తుందని కొందరు భావిస్తున్నారు. 
 

ఎన్‌ఏ‌టి హెల్త్ అధ్యక్షురాలు, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ ప్రీత రెడ్డి మాట్లాడుతూ, కరోనా వ్యాధి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో పెద్ద మార్పును తెచ్చిపెట్టింది. దీనివల్ల ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య కార్యకర్తల శిక్షణ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కోసం జాతీయ స్థాయి కార్యక్రమాలు, వైద్య కళాశాలల సంఖ్యను పెంచడం అలాగే సమర్థవంతమైన పిపిపి మోడల్ & స్థానిక తయారీని ప్రోత్సహించడం".అవసరమని అన్నారు.
undefined
"ఈసారి బడ్జెట్ 2021లో ఈ రంగానికి అదనపు ప్రోత్సాహకాలు లభిస్తాయని, ఇది వారి పరిస్థితిని మెరుగుపరుస్తుందని, ఇంకా వారు రెండవ, మూడవ శ్రేణి నగరాలకు విస్తరించవచ్చని ప్రైవేటు రంగ సంస్థలు భావిస్తున్నాయని" అన్నారు.
undefined
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆరోగ్య సంరక్షణ రంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయింపు అవసరం ఉందని ఫోర్టిస్ హెల్త్‌కేర్ రీజనల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) అశుతోష్ రఘువంషి అన్నారు. విదేశీ మారక సంపాదన పరంగానే కాదు, ఉపాధి పరంగా కూడా ఈ రంగం ముఖ్యమని రఘువంషి అన్నారు.
undefined
ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపిఎ) ప్రధాన కార్యదర్శి సుదర్శన్ జైన్ మాట్లాడుతూ, మొత్తం పాలసీ పర్యావరణ వ్యవస్థ ఆరోగ్య సంరక్షణ రంగంపై దృష్టి పెట్టాలని, ఆరోగ్య మౌలిక సదుపాయాలను నిర్మించాలని అన్నారు. ఫార్మా పరిశ్రమ పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల కోసం మద్దతు ఇంకా ప్రోత్సాహం కోసం చూస్తోందని ఆయన అన్నారు.
undefined
'కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. కేంద్ర బడ్జెట్ 2021 నుండి భారతదేశంలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యను గుర్తించడం ఇంకా భారతదేశం అంతటా కౌన్సెలింగ్ అండ్ మానసిక ఆరోగ్య స్టార్టప్‌లను సులభతరం చేయడానికి అధిక నిధులను ఆశిస్తున్నాయి. మానసిక ఆరోగ్య చికిత్సను అందించే లక్ష్యంతో కార్పొరేట్‌ల కోసం ప్రభుత్వం మెంటల్ హెల్త్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని మేము ఆశిస్తున్నాము. సైకోలాజిస్ట్స్, సైకియార్టిస్ట్స్, కౌన్సిలర్స్ కోసం అధిక సీట్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం నిధులు ఏర్పాటు చేయాలి. ' అని గుర్ ప్రీత్ సింగ్ అరోరా, వైద్య కేంద్రం వ్యవస్థాపకుడు అన్నారు.
undefined
click me!