బడ్జెట్ 2022: క్రిప్టోకరెన్సీల ఆదాయాలపై పన్ను ఉంటుందా.. ప్రభుత్వ ప్రణాళిక ఎంటో తెలుసుకోండి..

First Published Jan 15, 2022, 12:59 PM IST

గత ఏడాది 2021 సంవత్సరంలో క్రిప్టోకరెన్సీ(cryptocurrency)లో  చాలా పెట్టుబడులు(investments) జరిగాయి. అలాగే భారతదేశం కూడా క్రిప్టో పెట్టుబడిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.  దీంతో ప్రభుత్వం  క్రిప్టో గురించి లోతుగా చర్చించిన తర్వాత దీనిపై ఒక బిల్లును సిద్ధం చేయాల్సి వచ్చింది. 

 అయితే, దీనిని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. మరోవైపు ప్రజలు బడ్జెట్ 2022లో డిజిటల్ కరెన్సీకి సంబంధించి పెద్ద ప్రకటనను ఆశిస్తున్నారు. నిపుణుల ప్రకారం బడ్జెట్2022 సమయంలో క్రిప్టో నుండి వచ్చే ఆదాయాలపై ప్రభుత్వం భారీ పన్నులు విధించే అవకాశం ఉంది. 
 

ఫిబ్రవరి 1న బడ్జెట్‌2022
దేశంలోని సాధారణ పన్ను చెల్లింపుదారులు, వ్యాపారవేత్తలు అలాగే భారతీయ క్రిప్టో పెట్టుబడిదారులు బడ్జెట్ 2022పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రిప్టోకరెన్సీలకు సంబంధించి కూడా ఈ బడ్జెట్‌లో కొన్ని ప్రకటనలు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నివేదికల ప్రకారం, క్రిప్టోకరెన్సీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ పన్నుల నిపుణుల నుండి సలహాలు తీసుకుంటోంది. నిజానికి, ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి లేదా వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంపై పన్నును స్పష్టంగా నిర్వచించాలనుకుంటోంది. క్రిప్టోకరెన్సీల నుండి వచ్చే ఆదాయాన్ని వ్యాపార ఆదాయంగా లేదా మూలధన లాభంగా పరిగణించవచ్చా అని చర్చిస్తోంది.

క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులపై భారం
ప్రతిపాదిత క్రిప్టోకరెన్సీ బిల్లులో క్రిప్టోకరెన్సీలను ఒక వస్తువుగా పరిగణించి, వర్చువల్ కరెన్సీలను వాటి ఉపయోగం ఆధారంగా విభిన్నంగా పరిగణించే నిబంధనలను చేర్చినట్లు గమనించవచ్చు. ఈ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాల్సి ఉండగా పన్ను, పరిశ్రమలకు సంబంధించిన పలు సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు బడ్జెట్‌లో చేయబోయే ప్రకటన ప్రకారం క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులపై పన్ను భారం గణనీయంగా పెరుగుతుందని ఒక నివేదిక చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం క్రిప్టో ఆస్తులపై ఆదాయపు పన్ను స్లాబ్‌ను 35 శాతం నుంచి 42 శాతం మధ్య ఉంచవచ్చని పేర్కొంది. దీనితో పాటు, క్రిప్టో ట్రెండింగ్‌పై 18 శాతం జిఎస్‌టి విధించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
 

క్రిప్టో ఎక్స్ఛేంజీలపై జి‌ఎస్‌టి
డిజిటల్ కరెన్సీ లేదా క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన ఏదైనా లావాదేవీకి అత్యధిక ఆదాయపు పన్ను శ్లాబ్‌లో పన్ను విధించబడుతుందని కొన్ని నివేదికలు ఊహాగానాలకు ఆజ్యం పోశాయి. క్రిప్టో బిల్లుపై చర్చ జోరందుకున్నప్పుడు, క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలపై ఒక శాతం జిఎస్‌టి విధించాలని ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొన్నప్పుడు కూడా ఎన్నో నివేదికలు విడుదలయ్యాయి. దీనితో పాటు క్రిప్టోకరెన్సీ పరిశ్రమ నియంత్రణను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ(sebi)కి అప్పగించడంపై చర్చ జరుగుతోంది. అంటే, సెబి క్రిప్టో పెట్టుబడిదారులను అన్ని సమయాలలో నిశితంగా గమనిస్తుంది ఇంకా క్రిప్టోకరెన్సీ  ప్రతి లావాదేవీ ఆదాయపు పన్ను శాఖ  రాడార్‌లో ఉంటుంది. అయితే ప్రభుత్వ పూర్తి ప్రణాళిక ఏమిటో బడ్జెట్‌  సమయంలోనే తేలనుంది. 
 

పన్ను నిపుణుల  కీలక సలహాలు
ఒక నివేదిక ప్రకారం, క్రిప్టోకరెన్సీలలో భారతీయుల పెట్టుబడి 2030 నాటికి 241 మిలియన్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. Nasscom అండ్ WazirX ప్రకారం, భారతదేశంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా క్రిప్టో పెట్టుబడిదారులు ఉన్నారు. నిర్దేశిత పరిమితికి మించిన క్రిప్టోకరెన్సీల లావాదేవీలను TDS/TCS నిబంధనల పరిధిలోకి తీసుకురావాలని పన్ను నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం పెట్టుబడిదారులపై నిఘా ఉంచుతుంది. అంతేకాకుండా, క్రిప్టోకరెన్సీల విక్రయం వల్ల వచ్చే నష్టాలను ఇతర ఆదాయానికి వ్యతిరేకంగా సర్దుబాటు చేయడానికి అనుమతించకూడదని ఆయన సలహా ఇచ్చారు.

click me!