మారిన కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారింది. మారి టెక్నాలజీ మనుషుల శ్రమను తగ్గించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇదే సమయంలో ఈ టెక్నాలజీని దుర్వినియం చేస్తూ కేటుగాళ్లు అమాయకులను దోచుకుంటారు. డిజిటల్ అరెస్ట్, ఓటీపీ స్కామ్, ఓఎల్ఎక్స్ స్కామ్ ఇలా రకరకాల పేర్లతో మోసాలకు దిగుతున్నారు.
దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు రంగంలోకి దిగుతున్నాయి. డిజిటల్ అరెస్ట్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాలర్ ట్యూన్స్ ద్వారా కూడా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.