లాక్‌డౌన్ ఎఫెక్ట్: రూ. 400 కోట్ల ఆదాయం కోల్పోయిన టీటీడీ

First Published May 12, 2020, 10:56 AM IST

లాక్ డౌన్ ఎఫెక్ట్ తిరుమల వెంకన్నను కూడ తాకింది.భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేయడంతో రూ. 400 కోట్ల మేరకు టీటీడీ ఆదాయం కోల్పోయిందని ఆలయవర్గాలు చెబుతున్నాయి. షిరిడి ఆలయం కూడ ఇదే తరహాలో ఆదాయాన్ని కోల్పోయింది. 

లాక్‌డౌన్ తిరుమల వెంకన్న రాబడిపై తీవ్ర ప్రభావం చూపింది. లక్షలాది మంది భక్తులు, కోట్లాది రూపాయాల రాబడితో టీటీడీ నిత్యం కళకళలాడేది. లాక్ డౌన్ దెబ్బకు రాబడి కూడ తగ్గిపోయింది.
undefined
ప్రతి రోజూ తిరుమల శ్రీవారిని లక్షలాది భక్తులు దర్శించుకొంటారు. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాలకు చెందిన భక్తులు కూడ ప్రతి రోజూ తిరుమలకు వస్తుంటారు.
undefined
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ ఏడాది మార్చి 20 వ తేదీ నుండి టీటీడీ భక్తులకు వెంకన్న దర్శనాన్ని నిలిపివేసింది. ఆర్జిత, దర్శనం టిక్కెట్ల డబ్బులను కూడ భక్తులకు టీటీడీ చెల్లించింది.సుమారు 2.50 లక్షల మంది భక్తులకు 1.93 లక్షలను టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల డబ్బులను తిరిగి చెల్లించింది
undefined
లాక్ డౌన్ విధించి ఇవాళ్టికి 50 రోజులు దాటాయి. దీంతో టీటీడీ రూ. 400 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ప్రతి రోజూ తిరుపతికి సుమారు 80 వేల నుండి లక్ష మంది భక్తులు హాజరౌతారు. లాక్ డౌన్ పుణ్యాన రెండు మాసాలుగా ఇంతవరకు ఒక్క భక్తుడు కూడ ఆలయానికి రాలేదు.
undefined
ఆలయ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు , ఇతర ఖర్చుల చెల్లింపులకు గాను టీటీడీ ఇప్పటికే రూ. 300 కోట్లు చెల్లించింది. ప్రతి ఏటా టీటీడీ వివిధ అవసరాల కోసం సుమారు రూ. 2500 కోట్లను ఖర్చు చేస్తోంది.
undefined
ప్రతి నెల టీటీడీ రూ. 200 నుండి రూ. 220 కోట్ల ఆదాయం వస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేయడంతో ఆదాయం లేకుండాపోయింది. అయితే ఆగమశాస్త్ర ప్రకారంగా ఆలయంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను యధావిధిగానే నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ స్వామి వారికి ఏకాంత సేవలను కొనసాగిస్తున్నారు.
undefined
2020-21 ఆర్ధిక సంవత్సరానికి తిరుమల తిరుపతి దేవస్థానం రూ. 3,309.89 కోట్లుగా అంచనా వేసింది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో సుమారు రూ. 150 నుండి రూ. 175 కోట్లు ఆదాయం కోల్పోయినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
undefined
అంతేకాదు దర్శనం టిక్కెట్లు, ఆర్జిత సేవా టిక్కెట్లు, ఇతరత్రా టిక్కెట్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడ టీటీడీ కోల్పోయింది.2020-21 ఆర్ధిక సంవత్సరంలో జీతాలు ఇతర అలవెన్సుల కింద రూ. 1,385.09 కోట్లకు పెరిగాయి
undefined
ప్రతి నెలా టీటీడీ రూ. 120 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది.ఎస్వీఐఎంఎస్, బీఐఆర్ఆర్డీ లాంటి సంస్థలకు టీటీడీ ప్రతి ఏటా కనీసం రూ. 400 కోట్లను గ్రాంట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
undefined
click me!