`తొలిప్రేమ` థియేటర్‌ తెర చించేసిన యువకులు.. అర్థరాత్రి నానా రచ్చ.. రాజకీయ కుట్ర..?

Published : Jul 01, 2023, 04:30 PM IST
`తొలిప్రేమ` థియేటర్‌ తెర చించేసిన యువకులు.. అర్థరాత్రి నానా రచ్చ.. రాజకీయ కుట్ర..?

సారాంశం

ఇటీవల కాలంలో రీ రిలీజ్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తుంది. అదే సమయంలో అభిమానులు థియేటర్లని ధ్వంసం చేయడం కూడా పెరుగుతుంది. తాజాగా `తొలిప్రేమ` థియేటర్‌లో అలాంటి ఘటన చోటు చేసుకుంది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన `తొలిప్రేమ` సినిమా అప్పట్లో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. 1998లో వచ్చిన ఈ సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌, యూత్‌ని బాగా ప్రభావితం చేసిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాతోనే వేలాది మంది యువత పవన్‌కి అభిమానులుగా మారిపోయారు. ఈ సినిమా విడుదలై 25ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుక్రవారం రీ రిలీజ్‌ చేశారు. ఇటీవల సూపర్‌ హిట్‌ సినిమాల రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో నిర్మాతలు `తొలిప్రేమ 4కే` వెర్షన్‌ రీ రిలీజ్ చేశారు. దాదాపు 300లకుపైగా థియేటర్లలో సినిమాని రిలీజ్‌ చేయడం విశేషం. దీనికి మంచి స్పందన లభించింది.

ఇదిలా ఉంటే రీ రిలీజ్ ల సమయంలో థియేటర్లని ధ్వంసం చేయడం ఇటీవల తరచూ జరుగుతుంది. కొంత మంది దుండగులు థియేటర్లలో నానా హంగామా చేస్తున్నారు. సీట్లు చించేయడం, స్క్రీన్లని కోసేయడం, లేదంటే నిప్పు పెట్టడం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు `తొలి ప్రేమ` సినిమాకి కూడా చోటు చేసుకుంది. విజయవాడ సమీపంలోని కాపర్థి థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి సెకండ్‌ షోలో కొంత మంది యువత సినిమా ప్రదర్శించబడుతున్న మధ్యలోనే స్క్రీన్‌ వద్దకి వచ్చి హంగామా చేశారట. 

స్క్రీన్‌ని చించేసి, సీట్లని ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆయా విజువల్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. జనరల్‌గా పవన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఈ సినిమాని చూస్తారు. వారితోపాటు కామన్‌ ఆడియెన్స్ కూడా వస్తుంటారు. అయితే అలానే కొంత మంది యువకులు థియేటర్లో ఈ దాడికి తెగబడ్డారట. అయితే దీన్ని అడ్డుకోబోయిన సిబ్బందిపై కూడా దాడి చేశారట. సీసీ కెమెరాలను, థియేటర్ అద్దాలను సైతం ధ్వంసం చేసినట్టు థియేటర్‌ యాజమాన్యం వెల్లడించింది. 

పవన్‌ ఫ్యాన్స్ పేరుతో కొందరు యువకులు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. అయితే దీని వెనకాల రాజకీయ కుట్ర ఏదైనా ఉండొచ్చేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొగబాంబులు తెచ్చి తెరపైకి విసిరారని, అడ్డుకున్న థియేటర్‌ సిబ్బందిపై దాడి చేశారని కపర్థి థియేటర్‌ మెనేజర్‌ మోహన్‌రావు తెలిపారు. తాను 47ఏళ్లుగా ఎగ్జిబిటర్‌ రంగంలో ఉన్నానని, కాని ఇలాంటి అరాచకం ఎప్పుడూ చూడలేదన్నారు. అభిమానుల పేరుతో ఇలా చేస్తే హీరోకే నష్టమన్నారు. ఈ దాడి వల్ల దాదాపు నాలుగు లక్షల వరకు నష్టం జరిగిందన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేసి ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని, ఇటువంటివి జరగకుండా పవన్ కళ్యాణ్ కూడా తమ అభిమానులను కంట్రోల్ చేయాలని కోరారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?