టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. 16 మందికి క్లీన్‌ చీట్‌..

By Aithagoni RajuFirst Published Sep 18, 2021, 5:17 PM IST
Highlights

తాజాగా టాలీవుడ్‌ ప్రముఖులందరికీ క్లీన్‌ చీట్‌ ఇస్తూ ఎక్సైజ్‌ శాఖ ఎఫ్‌ఎస్‌ఎల్‌కి నివేదిక ఇచ్చింది. స్వచ్ఛందంగా వారు రక్తం, గోళ్లు, వెంట్రుకల ఇచ్చారని ఎక్సైజ్‌శాఖ వెల్లడిచింది. ఇందులో డ్రగ్స్ తీసుకున్నట్టు ఎలాంటి నమూనాలు లేవని తెలిపింది. 

టాలీవుడ్‌లో దుమారం రేపిన డ్రగ్స్ కేసులో బిగ్‌ ట్విస్ట్ చోటు చేసుకుంది. కొద్ది సేపటి క్రితం దర్శకుడు పూరీ జగన్నాథ్‌, తరుణ్‌లకు ఫోరెన్సిక్‌ సైన్స్ లాబోరేటరి(ఎఫ్‌ఎస్‌ఎల్‌) క్లీన్‌ చీట్‌ ఇచ్చింది. తాజాగా టాలీవుడ్‌ ప్రముఖులందరికీ క్లీన్‌ చీట్‌ ఇస్తూ ఎక్సైజ్‌ శాఖ ఎఫ్‌ఎస్‌ఎల్‌కి నివేదిక ఇచ్చింది. స్వచ్ఛందంగా వారు రక్తం, గోళ్లు, వెంట్రుకల ఇచ్చారని ఎక్సైజ్‌శాఖ వెల్లడిచింది. ఇందులో డ్రగ్స్ తీసుకున్నట్టు ఎలాంటి నమూనాలు లేవని తెలిపింది. 

దీంతో పూరీ జగన్నాథ్‌,  తరుణ్‌లతోపాటు రవితేజ, తనీష్‌, ముమైత్‌ ఖాన్, శ్యామ్‌ కే నాయుడు, సుబ్బరాజు, నవదీప్‌, ధర్మారావు అలియాన్‌ చిన్నా, ఛార్మి, నందు, లకు క్లీన్‌ చీట్‌ ఇస్తూ ఎక్స్సైజ్‌ శాఖ తాజాగా వెల్లడించింది.  2017 జులైలో పూరి జగన్నాథ్, తరుణ్‌ల  నుంచి ఎక్సైజ్ అధికారులు రక్తం, గోళ్లను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరి పరీక్షించింది. దాంట్లో ఎక్కడా కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. 

గతేడాది డిసెంబర్ 8న దీనికి సంబంధించిన నివేదికను ఎఫ్ఎస్ఎల్ ఎక్సైజ్ శాఖకు సమర్పించింది. కెల్విన్‌పై ఛార్జ్‌షీటుతో పాటు వివరాలు కోర్టుకు సమర్పించింది ఎక్సైజ్ శాఖ. ప్రధాన నిందితుడు కెల్విన్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. 
ఇదిలా ఉంటే సెలబ్రిటీల నుంచి కెల్విన్‌కి మనీ ట్రాన్స్ ఫర్‌ అయినట్టుగా ఇటీవల ఈడీ విచారణలో బయటపడిన విషయం తెలిసిందే. మరి దీనిపై ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. 

click me!