
నాగచైతన్య(Naga Chaitanya) మరో కొత్త సినిమాని ప్రకటించారు. తమిళ్ డైరెక్టర్తో సినిమా చేయబోతున్నారు. ఫస్ట్ టైమ్ ఓ బైలింగ్వల్ (Naga Chaitanya Bilingual) సినిమా చేస్తున్నారు తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu)తో ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పై పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు, నిర్మాతలు ప్రకటించారు. దర్శకుడు తన ఆనందాన్ని పంచుకున్నారు. బ్రదర్ నాగచైతన్యతో ఈ చిత్రం చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇది నాగచైతన్య నటిస్తున్న 22వ చిత్రం కావడం విశేషం.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఫన్ రైడ్గా ఉంటుందని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి వెల్లడించారు. ఈ బైలింగ్వల్ సినిమా చేయడం పట్ల తన హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుందని వెల్లడించారు. అయితే ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనుందని టాక్. గతంలో వీరిద్దరు కలిసి `ఒక లైలా కోసం` సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ జోడీ కడుతుందని టాక్.
ఇక ప్రస్తుతం నాగచైతన్య `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా. ఈసినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మరోవైపు హిందీలోకి ఎంట్రీ ఇస్తూ అమీర్ ఖాన్తో `లాల్ సింగ్ చద్దా` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన ఆర్మీ పాత్రని పోషిస్తున్నారు. ఇది ఆగస్ట్ లో రాబోతుంది. మరోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే `దూత` అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు నాగచైతన్య.
ఇలా క్రమ క్రమంగా నటుడిగా ఓపెన్ అవుతున్నారు. అటు హిందీ, ఇటు తమిళం, మరోవైపు డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వాహ్ అనిపిస్తున్నారు. మరోవైపు ఈ సంక్రాంతికి `బంగార్రాజు`తో థియేటర్లో సందడి చేసి హిట్ అందుకున్నారు నాగచైతన్య. ఇదిలా ఉంటే గతేడాది అక్టోబర్ 2న సమంతతో విడిపోతున్నట్టు ప్రకటించిన షాకిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇద్దరం అనుకునే విడిపోయామని వెల్లడించారు చైతూ.