ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతూ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతూ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. జగన్ విజయం ఖాయమనే విషయం తేలిపోయింది. దీంతో జగన్ పార్టీ కార్యాలయాల్లో సంబరాలు షురూ చేశారు. జగన్ సైతం ఈ గెలుపు ముందే ఊహించామంటూ కామెంట్స్ చేశారు.
జగన్ గెలుపుపై ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. జగన్ కి శుభాకాంక్షలు చెప్పగా.. రచయిత కోన వెంకట్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో జగన్ కి విషెస్ చెబుతూ.. మునుపెన్నడూ చూడని పాలన మీ నుండి ఆశిస్తున్నామని పోస్ట్ పెట్టారు.
అయితే ఈ పోస్ట్ కి అత్యధిక మంది నెటిజన్లు నెగెటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఏపీ ప్రజలను ఆ దేవుడే కాపాడాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. జగన్ పై ఉన్న నేర చరిత్రను కామెంట్స్ గా పెడుతున్నారు.
మరికొందరైతే 420 సీఎం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది చూసిన జగన్ అభిమానులు కొందరు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. మొత్తానికి కోన పోస్ట్ జగన్, టీడీపీ అభిమానుల మధ్య గొడవకి దారి తీసింది.