ఉబెర్ షాకింగ్ న్యూస్: 600 ఉద్యోగుల తొలగింపు...

Ashok Kumar   | Asianet News
Published : May 26, 2020, 02:34 PM IST
ఉబెర్ షాకింగ్ న్యూస్: 600 ఉద్యోగుల తొలగింపు...

సారాంశం

కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం, లాక్ డౌన్ పొడిగింపు, రికవరీపై అనిశ్చితి నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది అని అని ఉబెర్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు.  

క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబెర్ ఇండియాలో ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. సంస్థ గతంలో ప్రకటించిన ప్రపంచ ఉద్యోగ కోతల్లో ఇది ఒక భాగమని పరమేశ్వరన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే భారతదేశంలో 600 మంది ఉద్యోగులను ఉబెర్ తొలగిస్తున్నట్లు తెలిపింది. క్యాబ్ సర్వీస్ ఓలా దేశంలో 1,400 మంది ఉద్యోగులను తొలగించిన వారం తరువాత ఉబెర్ ఇండియా ఈ చర్య తీసుకుంది.

కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం, లాక్ డౌన్ పొడిగింపు, రికవరీపై అనిశ్చితి నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది అని అని ఉబెర్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు.

ప్రభావిత ఉద్యోగులందరికీ వచ్చే ఆరు నెలల వరకు కంపెనీ పొడిగించిన వైద్య బీమాను అందించనుంది. అలాగే వారికి ఉబెర్ టాలెంట్ డైరెక్టరీలో చేరడానికి అవకాశం ఇచ్చింది. డ్రైవర్, రైడర్ సపోర్ట్, అలాగే ఇతర డివిజన్లలో పనిచేసే సుమారు 600 ఉద్యోగులపై  ఈ వేటు పడనుంది.

ప్రపంచవ్యాప్తంగా 3,000 ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లు ఉబెర్ గత వారం ప్రకటించింది, కరోనా వైరస్ వ్యాప్తి వల్ల క్యాబ్ రైడ్స్ డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రెండు వారాల్లో ఇది రెండవ అతి పెద్ద ఉద్యోగాల తొలగింపు.

also read లాక్‌ డౌన్ పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా వార్నింగ్ ...

శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఉబర్ సంస్థ ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి వారి ఉద్యోగులలో నాలుగింట ఒక వంతును తగ్గించింది, ఈ నెల ప్రారంభంలో 3,700 మందిని పేరోల్ నుండి తొలగించారు.

గత ఏడాది ఇదే నెలతో పోల్చితే ఏప్రిల్‌లో రైడ్స్‌ వ్యాపారం 80 శాతం పడిపోయినందున కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 45 కార్యాలయాలను మూసివేయడం లేదా ఏకీకృతం చేయనుంది. కరోనా వైరస్ మహమ్మారి సంస్థ విదేశీ పెట్టుబడులను నాశనం చేయడంతో మొదటి త్రైమాసికంలో ఉబెర్ 2.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 21,948 కోట్లు) కోల్పోయింది.

ఉబెర్ ప్రభావిత ఉద్యోగులందరికీ  ప్రతి ఒక్కరికి కనీసం 10 నెలల జీతం చెల్లింపుతో రాబోయే ఆరు నెలలకు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్, అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్, ల్యాప్‌టాప్‌ల వాడకానికి అనుమతి నిస్తున్నట్టు  ఆయన చెప్పారు. 

ఓలా కూడా 1400 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో లాక్ డౌన్ వల్ల రైడ్-హెయిలింగ్, టాక్సీ సేవలపై  తీవ్రమైన ప్రభావం పడింది. మొదటి దశ లాక్ డౌన్ అమల్లోకి వచ్చినప్పుడు మార్చి 25న ఉబర్ సేవలు నిలిపివేయబడ్డాయి తిరిగి  ఈ నెల ప్రారంభంలో ప్రారంభమయ్యాయి. ఓలా, ఉబెర్ కాకుండా, జోమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ అగ్రిగేటర్లు కూడా వందలాది మంది ఉద్యోగులను తొలగించారు.

PREV
click me!

Recommended Stories

Swivel Seat: ఇక వృద్ధులకు కారెక్క‌డం ఇబ్బంది కాదు.. అద్భుత ఆలోచ‌న చేసిన మారుతి
Maruti Grand Vitara : ఈ స్టైలిష్ కారును ఇప్పుడే కొంటే.. ఏకంగా రూ.2.19 లక్షల డిస్కౌంట్