union Budget 2023: గత ఏడాది బడ్జెట్ 2022లో టెక్నాలజి రంగం ఏం పొందింది.. ఈసారి అంచనాలు ఏంటి..?

By asianet news teluguFirst Published Feb 1, 2023, 9:33 AM IST
Highlights

 గత ఏడాది బడ్జెట్-2022ను సమర్పిస్తూ మైక్రోచిప్‌లతో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను త్వరలో దేశంలో జారీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2022-23లోపు ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు 5G మొబైల్ సేవలను ప్రారంభించడానికి అవసరమైన స్పెక్ట్రమ్ వేలం గురించి ఇంకా మే 2022 నాటికి టెల్కోలు ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతించడం గురించి బడ్జెట్ 2022లో  మాట్లాడారు. 
 

కొత్త ఆర్ధిక సంవత్సరం 2023-24 బడ్జెట్‌ను నేడు అంటే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హయాంలో వస్తున్న ఈ ఐదో బడ్జెట్‌ను కొద్ది గంటల్లో తీసుకురానున్నారు. వచ్చే ఏడాది అంటే 2024లో ఎన్నికలు కూడా ఉన్నాయి, కాబట్టి ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రెండవసారి చివరి పూర్తి బడ్జెట్ కూడా అవుతుంది.

గత రెండేళ్ల బడ్జెట్‌ లాగానే ఈ బడ్జెట్‌ను కూడా పేపర్ లెస్  రూపంలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న సమర్పించనున్న బడ్జెట్ 2023పై 140 కోట్ల మందికి పైగా దేశప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే  2022 బడ్జెట్‌లో టెక్నాలజి రంగానికి ఏం లభించింది, 2023లో ఈసారి సమర్పించబోయే బడ్జెట్ నుండి ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలుసుకుందాం…

 గత ఏడాది బడ్జెట్-2022ను సమర్పిస్తూ మైక్రోచిప్‌లతో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను త్వరలో దేశంలో జారీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2022-23లోపు ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు 5G మొబైల్ సేవలను ప్రారంభించడానికి అవసరమైన స్పెక్ట్రమ్ వేలం గురించి ఇంకా మే 2022 నాటికి టెల్కోలు ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతించడం గురించి బడ్జెట్ 2022లో  మాట్లాడారు. 

2022 బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాల్లో చౌకగా బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. 2022-23లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీని విడుదల చేస్తుందని, దీని కోసం బ్లాక్‌చెయిన్ అలాగే ఇతర టెక్నాలజి సహాయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఆ తర్వాత డిసెంబర్ 1న ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌లలో పైలట్ దశలో డిజిటల్ రుపీ ప్రారంభించారు. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ కరెన్సీ పేరు RBI డిజిటల్ రూపి. 

బడ్జెట్ 2022లో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను సరళీకృతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్‌ను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ డిజిటల్‌ చెల్లింపులను సులభతరం చేయాలని, సులభంగా లావాదేవీల కోసం పోస్టాఫీసులు, బ్యాంకులను అనుసంధానం, ఈ-పాస్‌పోర్ట్‌లు జారీ చేయాలని కూడా ఆర్థిక మంత్రి పట్టుబట్టారు. 

బడ్జెట్ 2023 నుండి టెక్నాలజి రంగానికి అంచనాలు 
*కొత్త బడ్జెట్‌లో టెక్ రంగం ప్రైవసీ, ప్రొటెక్షన్ వంటి సైబర్ సెక్యూరిటిని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
*2023 బడ్జెట్‌లో భారతీయ తయారీ, పెట్టుబడిని ప్రోత్సహించాలని భారతదేశ టెక్ లీడర్స్ అభిప్రాయం. తయారీ లేదా మేక్ ఇండియాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి రాయితీలు అలాగే ఆర్థిక ప్రోత్సాహకాలను అందించగలదు. 
*అమెరికా, చైనాల తర్వాత భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ హబ్‌గా అవతరిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో భారత ప్రభుత్వ PLI (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) పథకం గేమ్ ఛేంజర్ అని నిరూపించవచ్చు. మేక్ ఇన్ ఇండియా PLI పథకం నుండి చాలా ప్రోత్సాహాన్ని పొందుతోంది. 2023 బడ్జెట్‌లో, మేక్ ఇండియాకు ఊతమిచ్చే ఇతర పథకాలపై కూడా పని చేయవచ్చు.
*వినూత్న సాంకేతికత వైపు ప్రపంచంతో పోటీ పడేందుకు, కొత్త బడ్జెట్‌లో కృత్రిమ మేధస్సు, బ్లాక్‌చెయిన్, మెటావర్స్, 5G ఇంకా పరిశోధనలపై కూడా ఖర్చు పెంచవచ్చు. 
*ఇండియా  డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోసం ఇంకా దేశాన్ని 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి కొత్త సాంకేతికతపై ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. 
*IIT మద్రాస్ అభివృద్ధి చేసిన BharOS వంటి స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను ప్రోత్సహించడం ఇంకా ప్రభుత్వం ఇలాంటి సాంకేతికత అలాగే పరిశోధనలపై కూడా ఖర్చు చేయవచ్చు. 
 

click me!