ప్రియుడ్ని కట్టేసి యువతిపై గ్యాంగ్ రేప్ కేసు: ముప్పు తిప్పలు పెడుతున్న కృష్ణ

By telugu teamFirst Published Jun 24, 2021, 7:26 AM IST
Highlights

తాడేపల్లి సీతానగరం పుష్కర ఘాట్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. అతను అకస్మాత్తుగా రైల్వే ట్రాక్ వద్ద ప్రత్యక్షమయ్యాడు.

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతంలోని సీతానగరంలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు గత నాలుగు రోజులుగా పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అకస్మాత్తుగా అతను తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యాడు.

తన ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద అతను ప్రత్యక్షమయ్యాడు. స్థానికులు అతన్ని చూసి కేకలు వేశారు. దాంతో గూడ్స్ రైలు ఎక్కి కృష్ణ పరారయ్యాడు. దాంతో పోలీసులు అతని కోసం రైల్వే ట్రాక్, రైల్వే యార్డు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. కృష్ణ రైల్వే వంతెనను నివాసం చేసుకుని ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఇటీవల విహారానికి వెళ్లిన ప్రేమ జంటపై తాడేపల్లి ప్రాంతంలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద దాడి చేసిన విషయం తెలిసింది. యువకుడి కాళ్లూ చేతులూ కట్టేసి, యువతిపై సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. 

ఈ కేసులో మొబైల్ ఫోన్లు కీలకంగా మారాయి. బాధితురాలితో పాటు ఆమెతో ఉన్న యువకుడి సెల్ పోన్లు నిందితులు లాక్కున్నారు. వాటిని సీతానగరంలో తాకట్టు పెటటారు ఫోన్లు తాకట్టు పెట్టుకున్న ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. 

గ్యాంగ్ రేప్ కేసులో వెంకటేష్ తో పాటు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, కృష్ణ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతని కోసం పోలీసులు వేటాడుతున్నారు.

click me!