ప్రియుడ్ని కట్టేసి యువతిపై గ్యాంగ్ రేప్: పోలీసులకు చిక్కిన వెంకట్ రెడ్డి

By telugu teamFirst Published Aug 6, 2021, 10:25 AM IST
Highlights

ఏపీలో సంచలనం రేపిన యువతిపై అత్యాచారం కేసులో పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు. యువకుడిని కట్టేసి అతని ప్రేయసిపై అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడు వెంకట్ రెడ్డి పోలీసులకు చిక్కాడు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సీతానగరం అత్యాచారం కేసులో పోలీసులు ప్రధాన నిందితుడు వెంకట్ రెడ్డిని పట్టుకున్నారు. మరో నిందితుడు కృ్ణ ఇంకా పరారీలోనే ఉన్నాడు. సీతానగరంలో నిందితులు ప్రియుడిని కట్టేసి యువతిపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. నిందితులు చాలా కాలంగా పరారీలో ఉన్నారు. ఎట్టకేలకు ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 

సీతానగరం అత్యాచారం కేసులోని ఇద్దరు నిందితుల్లో వెంకట్ రెడ్డిని చివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వెంకట్ రెడ్డిని పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.

పోలీసులు యాచకులను, హిజ్రాలను, సమోసాల అమ్మకందార్లను, రైల్వే ట్రాక్ వద్ద చెత్త ఏరుకునే వారిని విచారిస్తూ చివరకు ఒంగోలు ఫ్లై ఓవర్ కింద విశ్రాంతి తీసుకుంటున్న వెంకట్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. రెండో నిందితుడు కృష్ణ కూడా ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ఒంగోలు రైల్వే ట్రాక్ ల్లో, ఇతర ప్రాంతాల్లోనూ గాలింపు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. 

ఇద్దరు నిందితులు కూడా క్యాటరింగ్ చేస్తున్నట్లు పోలీసులు పక్కా సమాచారం అందింది. దీంతో వాళ్లు ఒంగోలు, చీరాల, బాపట్ల, అద్దంకి ప్రాంతాల్లో, చెన్నై ర్లైవ్ మార్గంలోని ప్రధాన పట్టణాల్లో, గ్రామాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు జరుపుతున్నారు.

click me!