కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి.. రేప్, వీడియో తీసి..

By telugu teamFirst Published Apr 25, 2019, 7:37 AM IST
Highlights

మంచి మాటలతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత.. మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకువెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. 

మంచి మాటలతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత.. మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకువెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. దానిని వీడియో తీసి యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నర్సాపురంలోని ఐడియా షోరూంలో పనిచేసే యువతి (19)కి స్థానికంగా నివాసముండే డేగల రాంబాబు పరిచయమయ్యాడు. ఓ ముఖ్యమైన పనుందని చెప్పి గత ఆగస్టులో భీమవరంలోని తన నివాసానికి తీసుకెళ్లాడు. యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఈ వ్యవహారమంతా వీడియో తీసి యువతిని గత కొంతకాలంగా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన యువతి భీమవరం పోలీసులను ఆశ్రయించి ఘటనపై ఫిర్యాదు చేసింది. రాంబాబు సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడని, అతని సొంతూరు ఏనుగువాని లంక అని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

click me!