చిత్తూరులో హైటెక్ వ్యభిచారం....ఒక్క రాత్రికి రూ.30వేలు

By telugu teamFirst Published Dec 16, 2019, 1:53 PM IST
Highlights

యువతుల వ్యవహారం చూసే స్థానికులకు వీళ్లు కళాశాల విద్యార్థులుగా భావించేవారు. ఇక్కడున్న ఓ వ్యక్తి అసలు విషయాన్ని గుర్తించి నేరుగా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

చిత్తూరులో హైటెక్ వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో.. పోలీసులు పక్కా ప్లాన్ వేసి మరీ వ్యభిచారం గుట్టుని రట్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... నగరంలోని మురకంబుట్టలో ఓ ముఠా కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తోంది. అందమైన యువతుల ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసి.. వాళ్ల రేట్లను సైతం అందులో ఉంచుతారు. అందులో ఒక్కొక్కరికీ వాళ్ల అందాన్ని బట్టి రేటు నిర్ణయిస్తారు. ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు ధరలు నిర్ణయించారు.

యువతుల వ్యవహారం చూసే స్థానికులకు వీళ్లు కళాశాల విద్యార్థులుగా భావించేవారు. ఇక్కడున్న ఓ వ్యక్తి అసలు విషయాన్ని గుర్తించి నేరుగా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విటులుగా మగ పోలీసులను పంపించి, మఫ్టీలో ఆడ పోలీసులతో నిఘా ఉంచి చాకచక్యంగా వ్యభిచార వ్యవహారాన్ని పట్టుకున్నారు. 

ఈ మొత్తం ఘటనలో మురకంబట్టుకు చెందిన ఓ మహిళ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇందులో ఎంతటి వాళ్లున్నా వదిలే ప్రసక్తేలేదని పోలీసులు చెబుతున్నారు. నిర్వాహకురాలిని సైతం అదుపులోకి తీసుకున్నారు. యువతులను మాత్రం వారి సొంత ఊర్లకు పంపడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. మొత్తంగా ఈ  దాడుల్లో నలుగురు యువతులను, ఓ విటుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 
 

click me!