Asianet News TeluguAsianet News Telugu

మెదక్ లో కలకలం... మహిళను ముక్కలు ముక్కలుగా నరికి..

చనిపోయిన మహిళ వయసు దాదాపు 35 ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. వారం రోజుల క్రితమే ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంపేసి అనంతరం ముక్కలు ముక్కలుగా నరికి ఉంటారని వారు చెబుతున్నారు. అనంతరం పాలిథిన్ కవర్లలో చుట్టి భూమిలో పాతిపెట్టినట్లు తెలుస్తోంది.

Woman's chopped body parts found near temple in medak
Author
Hyderabad, First Published Nov 2, 2019, 1:42 PM IST

మెదక్ జిల్లా ఏడుపాయల టెంపుల్ సమీపంలో తీవ్ర కలకలం రేగింది. పోలీసులకు ఆ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి... పాలిథిన్ కవర్లలో చుట్టి... ఉంచడం గమనార్హం. కాగా... చనిపోయిన మహిళ ఎవరు అనేది ఎవరని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చనిపోయిన మహిళ వయసు దాదాపు 35 ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. వారం రోజుల క్రితమే ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంపేసి అనంతరం ముక్కలు ముక్కలుగా నరికి ఉంటారని వారు చెబుతున్నారు. అనంతరం పాలిథిన్ కవర్లలో చుట్టి భూమిలో పాతిపెట్టినట్లు తెలుస్తోంది.

ఓ వ్యక్తి గుడికి వెళ్తుండగా.... తొలుత వాటిని గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా...వారు అక్కడికి వచ్చి పరిశీలించారు. కాగా... మహిళ శరీర భాగాలు గుడికి 600మీటర్ల దూరంలోనే ఉండటం విశేషం. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ శరీర భాగాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. 

మిస్సింగ్ కేసు ల ఆధారంగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios